Begin typing your search above and press return to search.

సాయంత్రం ఫోన్ మోగితే మినిస్టరే...?

By:  Tupaki Desk   |   9 April 2022 4:30 PM GMT
సాయంత్రం ఫోన్ మోగితే మినిస్టరే...?
X
ఏపీలో మంత్రి వర్గ విస్తరణ తుది ఘట్టానికి చేరుకుంది. కేవలం గంటల వ్యవధిలఒకి కధ వచ్చేసింది. ఇక కొత్త మంత్రులు ఎవరు అన్నది కూడా 10వ తేదీ సాయంత్రానికి తెలిసిపోతుంది. దీనికి సంబంధించిన లిస్ట్ రేపు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి చేరుతుంది. అక్కడ ఆమోదముద్ర పడడమే తరువాత లిస్ట్ అనఫిషియల్ గా రిఫీల్ అవుతుంది.

ఆ సంగతి అలా ఉంటే కొత్త మంత్రులకు స్వయంగా జగన్ ఫోన్ చేసి ప్రమాణానికి ఆహ్వానిస్తారు అంటున్నారు. ఇది నిజంగా కొత్త న్యూస్. అరుదైన ఘటనగానే చూడాలి. జగన్ సీఎం అయిన తరువాత తొలి విడతలో కాబోయే మంత్రులకు ఫోన్లు ఇలాగే వచ్చాయి. కానీ నాడు జగన్ వారికి ఫోన్లు చేయలేదు.

ఇపుడు మాత్రం జగనే స్వయంగా ఆ స్వీట్ న్యూస్ కొత్త మంత్రులకు చెప్పబోతున్నారు. అన్నా మీరే మంత్రి, రేపు ప్రమాణ స్వీకారానికి రావాలి అంటూ జగన్ వారిని పిలుస్తారు అని తెలుస్తోంది. అలాగే చెల్లెమ్మా నీవే మినిస్టర్ వి తల్లీ అని కూడా పిలవవచ్చు.

దాంతో ఈ రోజు అయితే ఆశావహులకు నిద్ర పట్టేదిలేదు. ఇక ఇపుడు లాబీయింగ్ టైమ్ దాటిపోయింది. ఎటూ లిస్ట్ రెడీ అయింది కాబట్టి అంతా చూసేది ఫోన్ కాల్ కోసమే. అంటే ఈ రోజూ రేపూ ఆశావహులకు ప్రియ నేస్తం, డియరెస్ట్ డార్లింగ్ ఎవరంటే వారి ఫోన్లే. దాంతో ఫోన్లు జేబులోనో, చేతిలోనో పెట్టుకోవాలి. లేక తాము ఎక్కడ ఉంటే అక్కడికి ఈ రోజు అంతా తీసుకుపోవాల్సిందే.

ఎవరి ఫోన్ కి సీఎం జగన్ కాల్ వస్తే వారే మినిస్టర్. మరి ఆ లక్ ఎవరిది. ఆ జాక్ పాట్ ఎవరికి దక్కేది అన్నది చూడాల్సిందే. ఏది ఏమైనా వైసీపీలో జగన్ ఏలుబడిలో ఈ టెర్మ్ లో ఇదే మంత్రిగా లాస్ట్ చాన్స్. మళ్ళీ 2024లో వైసీపీ అధికారంలోకి వస్తే అపుడు మంత్రులు కావచ్చు. కానీ ఈ దఫాకు ఇదే అవకాశం. మరి ఆ పుణ్యం, ప్రాప్తం ఎవరికో.