Begin typing your search above and press return to search.

శంకుస్థాపనలో బీజేపీ పాసులకు నో

By:  Tupaki Desk   |   24 Oct 2015 4:32 AM GMT
శంకుస్థాపనలో బీజేపీ పాసులకు నో
X
అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఏపీ బీజేపీ శాఖ అందించిన పాసులకు పోలసులు ఎంట్రీ నో అనటం కాస్త కలకలాన్ని రేపింది. ప్రధాని మోడీ వస్తున్న సభలకు పాసుల కోసం ఏపీ బీజేపీ నేతల నుంచి విపరీతమైన ఒత్తిడి రావటంతో.. వారు ప్రభుత్వం నుంచి పాసుల్ని తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

ఏపీ బీజేపీ ఇచ్చిన పాస్ లను తీసుకొని శంకుస్థాపన మహోత్సవానికి వెళ్లిన పలువురికి చేదు అనుభవం ఎదురైంది. పాసుల మీద హలోగ్రామ్ లేదని.. అలా లేని వాటిని అనుమతించేది లేదని కరాఖండిగా చేప్పేశారు. దీంతో.. కమలనాథులు కంగుతిన్న పరిస్థితి.

దీంతో.. తీవ్ర నిరాశకు గురైన వారు.. తమ నాయకత్వానికి ఫోన్ చేయటంతో వారు కలుగజేసుకొని సర్దుబాటు చేసినట్లుగా చెబుతున్నారు. తమ పార్టీకి చెందిన ప్రదాని వస్తున్న కార్యక్రమానికి తమకిచ్చిన పాసులు చెల్లకపోవటంపై ఏపీ కమలనాథులు కస్సుబుస్సులాడారు. తమ వారికి ఇచ్చిన పాసులన్నీ ఏపీ సర్కారు తమకు అందించినవే ఇచ్చామని.. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పిన తర్వాత అనుమతించినట్లుగా చెబుతున్నారు. ఏమైనా శంకుస్థాపన రోజున ఏపీ బీజేపీనేతలకు కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు.