Begin typing your search above and press return to search.

తాగేసి.. కేంద్ర‌మంత్రి ఇంటి గోడ‌నే గుద్దేశాడు

By:  Tupaki Desk   |   16 May 2017 9:37 AM GMT
తాగేసి.. కేంద్ర‌మంత్రి ఇంటి గోడ‌నే గుద్దేశాడు
X
తాగిన మ‌త్తులో ఇష్టారాజ్యంగా వాహ‌నాల్ని న‌డ‌ప‌టం ఈ మ‌ధ్య‌న మ‌రింత పెరుగుతోంది. తాజా ఉదంతం చూస్తే.. తాగుబోతుల వ్య‌వ‌హారం ప‌రాకాష్ఠ‌గా చేరుకున్న‌ట్లుగా చెప్పాలి. తాజాగా దేశ రాజ‌ధాని ఢిల్లీలో తాగిన మ‌త్తులో ఓ క్యాబ్ డ్రైవ‌ర్ ఏకంగా కేంద్ర‌మంత్రి ఇంటి గోడ‌నే ఢీ కొట్టిన ఉదంతం చోటు చేసుకుంది.

ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన క్యాబ్ డ్రైవ‌ర్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని లూటైన్స్‌ లో ఉన్న క్రిష్ట మీన‌న్ మార్గ్ లోని కేంద్ర‌మంత్రి కిర‌ణ్ రిజోజి అధికారిక నివాసం ఉంది. ఈ ఇంటి ముందున్న ప్ర‌హ‌రీ మీద‌కు ఓ క్యాబ్ వేగంగా దూసుకెళ్లింది. ఈ ఉదంతంలో ఇంటి గోడ దెబ్బ తింది.

తాగేసి కేంద్ర‌మంత్రి ఇంటిని గుద్దేసిన క్యాబ్ డ్రైవ‌ర్ ను నోయిడాకు చెందిన అభిషేక్ గా గుర్తించారు. కేంద్ర‌మంత్రి ఇంటి గోడ‌ను గుద్దేసిన స‌మ‌యంలో కారులో అత‌డితో పాటు మ‌రో మ‌హిళ ఉండ‌టం గ‌మ‌నార్హం. క్యాబ్ డ్రైవ‌ర్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అత‌డికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. మ‌ద్యం సేవించిన‌ట్లుగా గుర్తించారు. కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ ఉదంతంలో ఇంటికి కాపాలా కాసే అధికారులు గాయ‌ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. అయినా.. కేంద్ర‌మంత్రి స్థాయి నేత ఇంటి గోడ‌ను ఓ క్యాబ్ డ్రైవ‌ర్ అలా గుద్దేయ‌టం ఏమిటి? అంత లోప‌భూయిష్టంగా సెక్యురిటీ ఉండ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/