Begin typing your search above and press return to search.

బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎన్‌పీసీఐ ...ఏమిటంటే !

By:  Tupaki Desk   |   11 Jan 2020 6:02 AM GMT
బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎన్‌పీసీఐ ...ఏమిటంటే !
X
ప్రస్తుతం బ్యాంకు తో పనిలేని వారంటూ లేరు. ప్రతి ఒక్కరు కూడా బ్యాంకు అకౌంట్ ని కలిగివున్నారు. అలాగే మన దేశంలో ఎన్నో రకాల బ్యాంకులు తమ సేవలని అందిస్తున్నాయి. కానీ , ఒక్కవిషయంలో మాత్రం బ్యాంకులు ఇప్పటివరకు వినియోగదారులని సంతృప్తి పరచలేకపోయాయి. అదేమిటి అంటే ఒక బ్యాంకు నుండి వేరొక బ్యాంకు ఖాతాకు డబ్బులు వేయలేము. అత్యవసరమైనా కూడా ఒక బ్యాంకు కస్టమర్, ఇంకో బ్యాంకు లో డబ్బులు వేయడానికి విలువుండేది కాదు. కానీ, బ్యాంకులు తమ కస్టమర్స్‌కి ఇచ్చే సర్వీసుల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. ఒక బ్యాంక్ కస్టమర్, మరో బ్యాంకుకు వెళ్లి తన ఖాతాలో డబ్బులు వేసుకునేలా.. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు సిద్దం చేసింది.

అంతేకాదు వేరే బ్యాంక్ ఏటిఎం సెల్ఫ్ డిపాజిట్ మెషీన్ ద్వారా మన బ్యాంక్ అకౌంట్‌ లోకి డబ్బులు జమ చేసుకోవచ్చు. ఈ మేరకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సలహాలపై దేశంలోని వివిధ బ్యాంకులు సమాలోచనలు చేస్తున్నాయి. దేశంలో అన్ని రకాల చెల్లింపులకు సంబంధించిన బాధ్యతలను ఎన్‌ పీసీఐ పర్యవేక్షిస్తుంది. క్యాష్ డిపాజిట్ ఇంటర్ ఆపరబిలిటీ సేవల వల్ల బ్యాంకులతో పాటు ఖాతాదారులు కూడా చాల ప్రయోజనాలు పొందవచ్చని ఎన్‌ సీపీఐ ఆధారాలను చూపుతుంది. నగదు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని, నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ ఆపరేషన్స్ ద్వారా ఇది సాధ్యమేనంటూ పేర్కొంది.

ఈ ప్రతిపాదనకు 14 బ్యాంకులు మొగ్గు చూపుతున్నాయి. ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. దాదాపు 30,000 వేల పైచిలుకు ఆటోమేటెడ్ టెల్లర్ మిషిన్స్‌ లో ఇంటర్ ఆపరబిలిటీ సర్విసెస్ వెసులుబాటు కల్పించవచ్చని, దీనికి టెక్నికల్ ఇబ్బందులు కూడా పెద్దగా ఉండవంటూ ఎన్‌ పీసీఐ వెల్లడించింది. ఇక ఈ సర్వీసెస్‌ కు ఛార్జీలు కూడా నిర్ణయించారు. ఒక బ్యాంకు కస్టమర్, మరో బ్యాంకుకిగానీ, ఏటీఎంకి గానీ వెళ్లి నగదు డిపాజిట్ చేయాలనుకుంటే.. రూ. 10,000లోపు అయితే రూ.25, రూ.10,000 దాటితే రూ.50 ఛార్జస్‌ గా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏటీఎంలో నగదు డిపాజిట్ చెయ్యడం వల్ల నకిలీ నోట్లు ప్రభావం ఎక్కువగా సర్కులేట్ అయ్యే అవకాశం ఉంటడం తో చాలా బ్యాంకులు ఈ సర్విసెస్‌ పై తర్జన భర్జనలు పడుతున్నాయి. ఇందుకోసం ఏటీఎంలలో సాఫ్ట్‌వేర్‌ ను అప్‌గ్రేడ్ చేసే దిశలో కూడా ఆలోచనలు చేస్తోన్నాయి.