Begin typing your search above and press return to search.

ప‌రిటాల శ్రీరామ్‌.. నిరాహార దీక్ష‌.. రీజ‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   7 Feb 2022 9:35 AM GMT
ప‌రిటాల శ్రీరామ్‌.. నిరాహార దీక్ష‌.. రీజ‌న్ ఇదే!
X
టీడీపీ యువ ఫైర్ బ్రాండ్‌, అనంత‌పురం జిల్లాకు చెందిన నేత ప‌రిటాల్ శ్రీరామ్‌.. రాజ‌కీయంగా దూకుడు గా ఉన్న విష‌యం తెలిసిందే. అధికార పార్టీపై ఆయ‌న విమ‌ర్శ‌లు సంధించ‌డంలో ముందున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న రాజ‌కీయాల్లో చురుగ్గానే ఉన్నారు.. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న‌లు.. చంద్ర‌బాబు పిలుపుమేర‌కు ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్ర‌బుత్వం తీసుకువ చ్చిన జిల్లాల విభ‌జ‌న‌తో.. ర‌ద్ద‌యిపోతున్న ధ‌ర్మ‌వ‌రం డివిజ‌న్‌ను కాపాడుకునేందుకు ప‌రిటాల తాజాగా దీక్ష‌కు కూర్చున్నారు.

ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దును నిరసిస్తూ పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్షకు దిగారు. ఎమ్మార్మో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. జిల్లాల పునర్విభజన, ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు చేయడం ఆటవిక విధానంగా ఉందన్నారు. ఏసీ రూముల్లో కూర్చుని విజయవాడలో నిర్ణయం చేయడం సమంజసం కాదని అన్నారు. ప్రజలకు ఏది అనుకూలమో కూడా ఆలోచించాలని.. ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు వల్ల 8 మండలాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.

ఎక్కడ కళ్యాణదుర్గం... ఎక్కడ రామగిరి కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్‌లో రామగిరి ఏ విధంగా కలుపుతారని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెవెన్యూ డివిజన్‌లో మార్పు జరిగిందని పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించారు. అంతకు ముందు ఉదయం ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకులు సృష్టించారు. ఎమ్మార్వో కార్యాలయం వద్ద వేసిన దీక్షా ప్రాంగణం టెంట్లను తొలగించారు. చిన్నపాటి వేదికను ఏర్పాటు చేసుకోవాలంటూ టీడీపీ నేతలకు పోలీసులు సూచించారు. ప్ర‌స్తుతం ఈ వివాదంకొన‌సాగుతూనే ఉండ‌డం గ‌మ‌నార్హం.