Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ పై బూతులతో రెచ్చిపోయిన పోసాని!
By: Tupaki Desk | 28 Sep 2021 2:27 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళీ షాకింగ్ కామెంట్స్ చేశారు. నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి పవన్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేసిన పోసానిపై ఆయన అభిమానులు బెదిరింపులకు పాల్పడ్డారట.. వరుసగా మెసేజ్ లు ఫోన్లు చేస్తూ బెదిరించడంతో పోసాని ఈరోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు వచ్చి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రెస్ క్లబ్ కు జనసేన ఫ్యాన్స్ రావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు వారిని అరెస్ట్ చేసి తరలించారు.
ప్రముఖ నటుడు, వైసీపీ సానుభూతి పరుడైన పోసాని కృష్ణమురళి మరోసారి ఈరోజు ప్రెస్ మీట్ లో పవన్ పై నిప్పులు చెరిగారు. సోమవారం సాయంత్రం ప్రెస్ మీట్ ముగిసి 24 గంటలు కూడా గడువక ముందే మళ్లీ ఆయన పవన్ ఫ్యాన్స్ ను వస్తున్న బెదిరింపులతో మీడియా ముందుకొచ్చి పవన్ పై తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు చేశారు. పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు.
పవన్ ఫ్యాన్స్ నుంచి తనకు పచ్చి బూతులు, అమ్మనా బూతులు తిడుతూ వేలాది మెసేజ్ లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యకు అక్రమ సంబంధం అంటగడుతున్నారని అన్నారు. పవన్ ను విమర్శిస్తే ఆయన అభిమానులు ఏ రకంగా స్పందిస్తున్నారో.. వైఎస్ జగన్ అభిమానిగా తాను అలానే స్పందించానని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ .. ఇదే పవన్ విమర్శిస్తే 'తుకడా' చేస్తానని హెచ్చరించారని.. అప్పుడు పవన్ ఫ్యాన్స్ ఏమయ్యారని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంటికెళ్లి ధర్నా చేశారా? లేక ఆయనకు బెదిరింపు మెసేజీలు పంపించారా? అని నిలదీశారు.
పవన్ ఫ్యాన్స్ సైకోలుగా వ్యవహరిస్తున్నారని.. బూతులు తిడుతున్నారని.. గ్యాప్ లేకుండా మెసేజీలు పంపిస్తున్నారని అన్నారు. తన కుటుంబ సభ్యుల జోలికి వెళ్లొద్దంటూ పవన్ ప్రెస్ మీట్ పెట్టి తన అభిమానులకు పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన సందేశం ఇవ్వకపోతే తాను కుటుంబ సభ్యుల జోలికి వెళ్తానని అన్నారు.
చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడితే తెలుగుదేవం పార్టీ సీనియర్ నేత, లోక్ సభ సభ్యుడు కేశినేని ఆయన కుమార్తెపై వివాదాస్పద కామెంట్స్ చేశారని పోసాని ఆరోపించారు. రాజకీయాలకు, కుటుంబ సభ్యులకు ఏం సంబంధం ఉందని చిరంజీవి బాధపడ్డారని అన్నారు. మంత్రి కురసాల కన్నబాబు దీనికి సాక్షి అని పోసాని అన్నారు.కురసాల, తన ఎదురుగా చిరంజీవి ఆవేదన చెందడాన్ని తాను తట్టుకోలేకపోయానని అన్నారు. నేరుగా కేశినేని ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడానని చెప్పారు. కేశినేని నానికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. వారిని ఎవరైనా ఏమైనా అంటే బాధపడరా? అని నిలదీశానని చెప్పారు. దీంతో కేశినేని నాని పశ్చాత్తాప పడ్డారని అన్నారు.
పవన్ కళ్యాణ్ కు కూడా ఒక కుమార్తె ఉన్నదని.. రేపొద్దున ఎవరైనా ఆమెను ఏమైనా అంటే ఆయన బాధపడరా? అని పోసాని ప్రశ్నించారు. తాను బతికే ఉంటానని.. పవన్ కు రక్తకన్నీరు తప్పదని జోస్యం చెప్పారు. నీ ఇంట్లో ఉండేవాళ్లే ఆడవాళ్లా..? మా ఇంట్లో ఉండే వాళ్లు ఆడవాళ్లు కాదా? అని నిలదీశారు. తన భార్యను బజారుకు ఈడుస్తూ పవన్ సైకో ఫ్యాన్స్ చేస్తోన్న మెసేజీలు వెంటనే ఆగకపోతే తాను కూడా పవన్ ఇంట్లో ఆడవాళ్లను రోడ్డుకు ఈడ్చేలా తిడతానని హెచ్చరించారు.
వైఎస్ జగన్ పవన్ ను రెండు చోట్ల ఓడగొట్టాడనే అక్కసు, ఆగ్రహం పవన్ కళ్యాణ్ కు ఉందని పోసాని ఆరోపించారు. ఆ కడుపు మంటలతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో పరిణతి, పరిపక్వత అవసరం అని.. అవి పవన్ కళ్యాణ్ అనే సైకలోలో లేవని విమర్శించారు. సైకో ఫ్యాన్స్ ను పెంచి పోషిస్తున్న పవన్ అతి పెద్ద సైకో అన్నారు. చిరంజీవి ఎప్పుడైనా ఇలా నోరు జారి మాట్లాడారా? అని ప్రశ్నించారు.
ఇక ఓ పంజాబీ అమ్మాయిని కడుపు చేసి రూ.5 కోట్లు ఇచ్చి వాళ్ల నోరు మూయించావ్ అని పోసాని సంచలన ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖుడు ఆమెకు కెరీర్ ఇస్తానంటే ప్రామిస్ చేసి మోసం చేశాడు.. ఆమెను గర్భవతిని చేశాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని బెదిరించాడు. అందుకు 5 కోట్ల రూపాయలు ఇచ్చాడు. కూడదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడట.. అని పోసాని సంచలన కామెంట్స్ చేశారు. నాకు తెలిసింది చెప్పానని వివరించారు. మానసిక రోగంతో ఆ అమ్మాయి ఎలా డిప్రెషన్ లోకి వెళ్లిందో తెలుసన్నారు.
-పోసానిపై దాడికి తరలివచ్చిన పవన్ ఫ్యాన్స్ ఉద్రిక్తత..
ఇక పోసాని కృష్ణమురళి విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తోన్న విషయం తెలుసుకొని పెద్ద సంఖ్యలో పవన్ అభిమానులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చారు. ఆయన అంతు చూస్తామంటూ బెదిరించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులు చేరుకొని అరెస్ట్ చేసి పవన్ ఫ్యాన్స్ ను అక్కడి నుంచి తరలించారు.
ప్రముఖ నటుడు, వైసీపీ సానుభూతి పరుడైన పోసాని కృష్ణమురళి మరోసారి ఈరోజు ప్రెస్ మీట్ లో పవన్ పై నిప్పులు చెరిగారు. సోమవారం సాయంత్రం ప్రెస్ మీట్ ముగిసి 24 గంటలు కూడా గడువక ముందే మళ్లీ ఆయన పవన్ ఫ్యాన్స్ ను వస్తున్న బెదిరింపులతో మీడియా ముందుకొచ్చి పవన్ పై తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు చేశారు. పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు.
పవన్ ఫ్యాన్స్ నుంచి తనకు పచ్చి బూతులు, అమ్మనా బూతులు తిడుతూ వేలాది మెసేజ్ లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యకు అక్రమ సంబంధం అంటగడుతున్నారని అన్నారు. పవన్ ను విమర్శిస్తే ఆయన అభిమానులు ఏ రకంగా స్పందిస్తున్నారో.. వైఎస్ జగన్ అభిమానిగా తాను అలానే స్పందించానని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ .. ఇదే పవన్ విమర్శిస్తే 'తుకడా' చేస్తానని హెచ్చరించారని.. అప్పుడు పవన్ ఫ్యాన్స్ ఏమయ్యారని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంటికెళ్లి ధర్నా చేశారా? లేక ఆయనకు బెదిరింపు మెసేజీలు పంపించారా? అని నిలదీశారు.
పవన్ ఫ్యాన్స్ సైకోలుగా వ్యవహరిస్తున్నారని.. బూతులు తిడుతున్నారని.. గ్యాప్ లేకుండా మెసేజీలు పంపిస్తున్నారని అన్నారు. తన కుటుంబ సభ్యుల జోలికి వెళ్లొద్దంటూ పవన్ ప్రెస్ మీట్ పెట్టి తన అభిమానులకు పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన సందేశం ఇవ్వకపోతే తాను కుటుంబ సభ్యుల జోలికి వెళ్తానని అన్నారు.
చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడితే తెలుగుదేవం పార్టీ సీనియర్ నేత, లోక్ సభ సభ్యుడు కేశినేని ఆయన కుమార్తెపై వివాదాస్పద కామెంట్స్ చేశారని పోసాని ఆరోపించారు. రాజకీయాలకు, కుటుంబ సభ్యులకు ఏం సంబంధం ఉందని చిరంజీవి బాధపడ్డారని అన్నారు. మంత్రి కురసాల కన్నబాబు దీనికి సాక్షి అని పోసాని అన్నారు.కురసాల, తన ఎదురుగా చిరంజీవి ఆవేదన చెందడాన్ని తాను తట్టుకోలేకపోయానని అన్నారు. నేరుగా కేశినేని ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడానని చెప్పారు. కేశినేని నానికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. వారిని ఎవరైనా ఏమైనా అంటే బాధపడరా? అని నిలదీశానని చెప్పారు. దీంతో కేశినేని నాని పశ్చాత్తాప పడ్డారని అన్నారు.
పవన్ కళ్యాణ్ కు కూడా ఒక కుమార్తె ఉన్నదని.. రేపొద్దున ఎవరైనా ఆమెను ఏమైనా అంటే ఆయన బాధపడరా? అని పోసాని ప్రశ్నించారు. తాను బతికే ఉంటానని.. పవన్ కు రక్తకన్నీరు తప్పదని జోస్యం చెప్పారు. నీ ఇంట్లో ఉండేవాళ్లే ఆడవాళ్లా..? మా ఇంట్లో ఉండే వాళ్లు ఆడవాళ్లు కాదా? అని నిలదీశారు. తన భార్యను బజారుకు ఈడుస్తూ పవన్ సైకో ఫ్యాన్స్ చేస్తోన్న మెసేజీలు వెంటనే ఆగకపోతే తాను కూడా పవన్ ఇంట్లో ఆడవాళ్లను రోడ్డుకు ఈడ్చేలా తిడతానని హెచ్చరించారు.
వైఎస్ జగన్ పవన్ ను రెండు చోట్ల ఓడగొట్టాడనే అక్కసు, ఆగ్రహం పవన్ కళ్యాణ్ కు ఉందని పోసాని ఆరోపించారు. ఆ కడుపు మంటలతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో పరిణతి, పరిపక్వత అవసరం అని.. అవి పవన్ కళ్యాణ్ అనే సైకలోలో లేవని విమర్శించారు. సైకో ఫ్యాన్స్ ను పెంచి పోషిస్తున్న పవన్ అతి పెద్ద సైకో అన్నారు. చిరంజీవి ఎప్పుడైనా ఇలా నోరు జారి మాట్లాడారా? అని ప్రశ్నించారు.
ఇక ఓ పంజాబీ అమ్మాయిని కడుపు చేసి రూ.5 కోట్లు ఇచ్చి వాళ్ల నోరు మూయించావ్ అని పోసాని సంచలన ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖుడు ఆమెకు కెరీర్ ఇస్తానంటే ప్రామిస్ చేసి మోసం చేశాడు.. ఆమెను గర్భవతిని చేశాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని బెదిరించాడు. అందుకు 5 కోట్ల రూపాయలు ఇచ్చాడు. కూడదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడట.. అని పోసాని సంచలన కామెంట్స్ చేశారు. నాకు తెలిసింది చెప్పానని వివరించారు. మానసిక రోగంతో ఆ అమ్మాయి ఎలా డిప్రెషన్ లోకి వెళ్లిందో తెలుసన్నారు.
-పోసానిపై దాడికి తరలివచ్చిన పవన్ ఫ్యాన్స్ ఉద్రిక్తత..
ఇక పోసాని కృష్ణమురళి విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తోన్న విషయం తెలుసుకొని పెద్ద సంఖ్యలో పవన్ అభిమానులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చారు. ఆయన అంతు చూస్తామంటూ బెదిరించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులు చేరుకొని అరెస్ట్ చేసి పవన్ ఫ్యాన్స్ ను అక్కడి నుంచి తరలించారు.