Begin typing your search above and press return to search.

మద్యం ప్రియులకు శుభవార్త.. ఆ రాష్ట్రంలో బార్లకు గ్రీన్ సిగ్నల్

By:  Tupaki Desk   |   25 Jun 2020 6:00 PM IST
మద్యం ప్రియులకు శుభవార్త.. ఆ రాష్ట్రంలో బార్లకు గ్రీన్ సిగ్నల్
X
చల్లటి బీరు.. చికెన్ ఫ్రై.. ఇలా ఇష్టమైనవి ఫ్రై చేసుకొని బార్లో కూర్చొని మందు తాగక ఎన్ని రోజులు అవుతుందో అని మథనపడిన మందుబాబుల కోరిక తీరింది. కరోనా-లాక్ డౌన్ తో మూతపడిన బార్లు తెరిచే రోజు వచ్చింది.

మద్యం షాపులు తెరిచిన ప్రభుత్వాలు కూర్చొని స్టఫ్ఫూ మద్యంతో ఎంజాయ్ గా తాగే బార్లకు అనుమతులు ఇవ్వలేదు. ఎందుకంటే కరోనా సామూహికంగా కూర్చుంటే వస్తుంది కావడంతో బార్లకు పర్మిషన్లు ఇన్నాళ్లు రాలేదు.

తాజాగా కేంద్రం అన్ లాక్ సడలింపులతో మద్యం షాపులు తెరుచుకున్నాయి. కేంద్రం తాజాగా మరిన్ని సడలింపులు ఇవ్వడంతో రాజస్థాన్ రాష్ట్రంలో సోమవారం నుంచి బార్లు తిరిగి తెరుచుకోవడానికి మార్గం సుగమం అయ్యింది.

జూన్ 8నుంచి హోటల్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. బార్లను మాత్రం తెరవలేదు. తాజాగా కేంద్రం సడలింపులతో బార్లను కూడా తెరుస్తున్నారు. సోమవారం నుంచి రాజస్థాన్ రాష్ట్రంలో బార్లు తెరిచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.