Begin typing your search above and press return to search.

వర్మ ‘వెన్నుపోటు’ ట్వీట్.. బాబు ఎన్ కౌంటర్

By:  Tupaki Desk   |   22 March 2019 4:41 AM GMT
వర్మ ‘వెన్నుపోటు’ ట్వీట్.. బాబు ఎన్ కౌంటర్
X
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయ వేడి రాజుకుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఫోకస్ కూడా రాజకీయాలపైనే పడింది. చాలా మంది సినీ ప్రముఖులు వైసీపీ, టీడీపీల్లో చేరుతున్నారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే రాంగోపాల్ వర్మ కూడా ఫాలో అవుతున్నాడనానికి ఆయన చేసిన తాజా ట్వీటే నిదర్శనం.

కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి.. చంద్రబాబు చేతిలో దారుణంగా మోసపోయారు. పోయిన సారి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు ఆకర్షితుడై చంద్రబాబును నమ్మి టీడీపీలో చేరారు. ఇప్పుడు 2019 ఎన్నికల వేళ బాబు.. అవసరం తీరాక ఎస్వీ మోహన్ రెడ్డిని కాలదన్నారు. కూరలో కరివేపాకులా టికెట్ ఇవ్వనని తీసిపారేశారు. దీంతో కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఎస్వీ మోహన్ రెడ్డికి తత్వం బోధపడి తాజాగా తిరిగి వైసీపీలో చేరారు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆయన ఎటువంటి షరతులు లేకుండా వైసీపీ తీర్థం పుచ్చుకొని కర్నూలులో టీడీపీ అభ్యర్థిని ఓడిస్తానని శపథం చేశారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ హాట్ హాట్ పరిణామాల మధ్యనే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. ఈ సంఘటనను తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్ కు తెలివిగా వాడేశాడు. ఇటీవలే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలోని ‘దగా దగా’ అంటూ సాగే ‘వెన్నుపోటు’ పాట విడుదల సందర్భంగా ఇదే కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి బాబుపై ప్రేమతో అందరికంటే ఎక్కువగా స్పందించారు. చంద్రబాబు ప్రతిష్టను వర్మ కించపరుస్తున్నాడని వర్మపై కర్నూలు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టించారు.

ఆ సందర్భాన్ని వర్మ గుర్తు చేసుకొని ఒక ఆసక్తికరమైన ట్వీట్ ను చేశారు. ‘వెన్నుపోటు పాటను నిరసించిన చంద్రబాబు వీరవిధేయుడు.. ఇప్పుడు ఆ చంద్రబాబుకే వెన్నుపొటు పొడిచి వైసీపీలో చేరారు. ఇది నిజం.. నమ్మండి’ అంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ఇలా నమ్మిన వాళ్లను బాబు నట్టేట ముంచి తన పాటకు న్యాయం చేశారని ట్వీట్ ద్వారా వర్మ వేసిన కౌంటర్ వైరల్ గా మారింది.