Begin typing your search above and press return to search.
చంద్రబాబు రాకముందు తుపాకి కలకలం...
By: Tupaki Desk | 16 July 2015 12:16 PM ISTగోదావరి పుష్కరాల్లో రోజుకో అంశం వార్తల్లో విషయంగా తెరమీదకు వస్తోంది. తాజాగా మరో విషయం విస్మయకరంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు గౌతిమి ఘాట్లో తాజాగా తుపాకి దొరకడం కలకలం రేపింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొవ్వూరులోని గౌతమి ఘాట్ను పరిశీలించనున్ననేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వద్ద రివాల్వర్ను గుర్తించారు.
పుష్కరాల ఘాట్ వద్ద అది కూడా... సీఎం పర్యటనకు ముందు రివాల్వర్ లభించడం ఒక్కసారిగా కలకలం రేపింది. రివాల్వర్ను స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. రాజమండ్రి ఘటన ప్రశాంతంగా సాగుతున్న పుష్కరాల్లో మచ్చగా మిగిలిపోయిందంటే..... పవిత్ర స్థానాలు చేసే చోట తుపాకి లభించడం ఇబ్బందికరమైన విషయమని భావిస్తున్నారు.
పుష్కరాల ఘాట్ వద్ద అది కూడా... సీఎం పర్యటనకు ముందు రివాల్వర్ లభించడం ఒక్కసారిగా కలకలం రేపింది. రివాల్వర్ను స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. రాజమండ్రి ఘటన ప్రశాంతంగా సాగుతున్న పుష్కరాల్లో మచ్చగా మిగిలిపోయిందంటే..... పవిత్ర స్థానాలు చేసే చోట తుపాకి లభించడం ఇబ్బందికరమైన విషయమని భావిస్తున్నారు.