Begin typing your search above and press return to search.

కొత్త సంవత్సరంలోనూ ఇరగదీశారు

By:  Tupaki Desk   |   10 Jan 2016 10:23 AM IST
కొత్త సంవత్సరంలోనూ ఇరగదీశారు
X
విన్నింగ్ పెయిర్ గా మారిన సానియా మీర్జా.. మార్టిన్ హింగిస్ లు మరోసారి తమ సత్తా చాటారు. 2015లో వీరిద్దరూ జతకట్టి మహిళల డబుల్స్ ట్రోఫీలను కైశసం చేసుకున్న వారు.. కొత్త ఏడాదిలో మొదలైన తొలి టోర్నీలోనూ విజేతగా నిలిచారు. బ్రిస్బేన్ ఓపెన్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. గత ఏడాది తొమ్మిది ట్రోఫీలను సొంతం చేసుకున్న ఈ జంట.. తాజా విజయంతో వరుసగా ఆరో ట్రోఫీ విజయాన్ని దక్కించుకున్నారు.

అంతేకాదు.. వరుసగా 26 మ్యాచ్ ల్లో విజయం సాధించినట్లైంది. 1994 తర్వాత మహిళల డబుల్స్ లో ఒక జోడీ వరుసగా ఇన్ని మ్యాచ్ లు గెలవటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. తాజాగా జరిగిన ఫైనల్స్ లో వైల్డ్ కార్డు ఎంట్రీతో బరిలోకి దిగిన కెర్బర్ – పెట్కొవిచ్ లను 7-6.. 6-1 వరుస సెట్లలో ఓడించారు. తొలి సెట్ పోటాపోటీగా సాగినా.. రెండో సెట్ మొత్తం ఏకపక్షంగా సాగింది.