Begin typing your search above and press return to search.

బీజేపీలో చేర్చుకున్న మోడీ పై సింధియా కామెంట్స్

By:  Tupaki Desk   |   12 March 2020 6:00 PM IST
బీజేపీలో చేర్చుకున్న మోడీ పై సింధియా కామెంట్స్
X
తరతరాల కాంగ్రెస్ ను వదిలి బీజేపీ లో చేరిన మధ్యప్రదేశ్ యువ నేత జ్యోతిరాధిత్య సింధియా ఎట్టకేలకు స్పందించారు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ లో చేరారు. ఈ సందర్భంగా సింధియా తన చేరికపై మాట్లాడారు. మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

తనను బీజేపీలో కి ఆహ్వానించి చోటు కల్పించినందుకు జేపీ నడ్డా, పీఎం మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని సింధియా మీడియా తో చెప్పుకున్నారు.

నా జీవితంలోనే రెండు పెద్ద మార్పులు జరిగాయని.. అది ఒకటి నా తండ్రి మరణం కాగా.. రెండోది తరతరాల కాంగ్రెస్ పార్టీని వీడి కొత్త జీవితాన్ని బీజేపీ లో ఎంచుకోవడం అని సింధియా అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఉన్న పార్టీ కాదని సింధియా స్పష్టం చేశారు.

కాంగ్రెస్ లో ప్రజా సేవ చేయలేమని సింధియా అన్నారు. పార్టీ ప్రస్తుత పరిస్థితి కూడా అలా చేయనీయదు అంటూ హాట్ కామెంట్స్ చేశారు.