Begin typing your search above and press return to search.

ఎన్ కౌంటర్ పై సుప్రీం సంచలన నిర్ణయం !

By:  Tupaki Desk   |   11 Dec 2019 2:07 PM IST
ఎన్ కౌంటర్ పై సుప్రీం సంచలన నిర్ణయం !
X
దిశ నిందుతుల ఎన్‌ కౌంటర్‌పై సుప్రీంకోర్టు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. దిశా నిందితుల ఎన్‌ కౌంటర్‌కు సంబంధించి పూర్తి సమాచారం తమ దగ్గర ఉందని సుప్రీం తెలిపింది. రిటైర్డ్ న్యాయమూర్తితో ఎన్‌ కౌంటర్‌పై విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని , రిటైర్డ్ జడ్జీ ఢిల్లీ నుంచే దిశ నిందితుల ఎన్‌ కౌంటర్ కేసును విచారిస్తారని తెలిపింది. ఆ తరువాత కేసు ని రేపటికి వాయిదా వేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

దిశా నిందితుల ఎన్‌ కౌంటర్‌పై జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ అనే ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. నలుగురు నిందితులను ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపి ఎన్‌ కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని.. ఈ ఘటనపై విచారణ జరిపించాలని, అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీతో పాటు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌‌ ను ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో, ఇతర రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల బృందంతో విచారణ జరిపించాలని కోరారు.