Begin typing your search above and press return to search.

స్వాతితో అతడి ఫోటోలు నిజమా? మార్ఫింగా?

By:  Tupaki Desk   |   8 July 2016 7:21 AM GMT
స్వాతితో అతడి ఫోటోలు నిజమా? మార్ఫింగా?
X
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగిని స్వాతి హత్యఉదంతం సుపరిచితమే. రైల్వే స్టేషన్ లో ట్రైన్ కోసం ఎదురుచూస్తున్న స్వాతినిఅత్యంత కిరాతకంగా నరికి చంపిన వ్యక్తి.. ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడిన రామ్ కుమార్ అన్న విషయం తేలటం.. అతన్ని పోలీసులుఅదుపులోకి తీసుకొని ఇంటరాగేట్ చేయటం లాంటి పరిణామాలన్నీ తెలిసిన అంశాలే. ఇప్పటికే ఈ ఉదంతంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా అలాంటి పరిణామమే మరొకటి చోటుచేసుకుంది.

ఫేస్ బుక్ లో స్వాతితో మొదలైన పరిచయంతోనే తాను చెన్నై వచ్చినట్లుగా రామ్ కుమార్ పేర్కొంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆమె తనను ఛీదరించుకోవటం.. కొండముచ్చు అంటూ హేళన చేయటంతోనే తాను చంపినట్లుగా పోలీసులకు రామ్ కుమార్ చెప్పినట్లుగా పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. తాజాగా రామ్ కుమార్..స్వాతిలు జోడీగా..సన్నిహితంగా ఉన్నట్లుగా చెప్పే ఫోటోలు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి.

ఫేస్ బుక్.. వాట్సప్ లలో వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోలు ఇప్పుడు కనిపించటంహాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఈ ఫోటోలు స్వాతి.. రామ్ కుమార్ కలిసితీయించుకున్నవి కాదని చెబుతున్నారు. కొన్ని విద్రోహ శక్తులు రామ్ కుమార్..స్వాతిల ఫోటోల్ని మార్ఫింగ్ చేసి ఈ విధమైన ప్రచారానికి పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఇలాంటి ఫోటోలతో ఇప్పటికే కూతుర్ని పోగొట్టుకున్న స్వాతి తల్లిదండ్రులకు మరింత వేదన కలగటం ఖాయమని చెబుతున్నారు. ఇలాంటివాటిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. మరోవైపు..తమిళనాడు వ్యాప్తంగా స్వాతి.. రామ్ కుమార్ లకు సంబంధించినవిగా చెబుతున్న ఫోటోలు విపరీతంగా షేర్ అవుతూ పలువురిలో పలు సందేహాలకు గురయ్యేలా చేస్తున్నాయి.