Begin typing your search above and press return to search.

ఆత్మ ప్రబోధానుసారం ఓటేయమని చెప్పి.. 10 క్రాస్ ఓట్లే టీ బీజేపీ టార్గెట్?

By:  Tupaki Desk   |   18 July 2022 5:30 AM GMT
ఆత్మ ప్రబోధానుసారం ఓటేయమని చెప్పి.. 10 క్రాస్ ఓట్లే టీ బీజేపీ టార్గెట్?
X
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఈ రోజు జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి.

ఈ ఎన్నికల ఫలితాలు అందరికి తెలిసినవే అయినప్పటికీ.. సాధించే మెజార్టీ విషయంలో బీజేపీ నేతలు పెట్టుకున్న తాజా టార్గెట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అన్ని అనుకున్నట్లే జరిగితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు షాకిచ్చేందుకు వీలుగా తెలంగాణ బీజేపీ నేతలు టార్గెట్ పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ వేళ.. గులాబీ బాస్ కు దిమ్మ తిరిగేలా షాకివ్వటానికి క్రాస్ ఓటింగ్ చేపట్టాలని టీ బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని ప్రచారం చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

టీఆర్ఎస్ అధినేత మీద గుర్రుగా ఉండి.. ఎన్నికలకు ముందు బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న నేతలతో షాకివ్వాలన్న యోచనలో బీజేపీ నేతలు ఉన్నట్లు చెబుతున్నారు.

ఇందులో భాగంగా పది ఓట్లు క్రాస్ ఓటింగ్ పడేలా చేయగలిగితే.. కేసీఆర్ స్థైర్యం మీద దెబ్బ కొట్టొచ్చన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా పది మంది ఎమ్మెల్యేలను ప్రభావితం చేసేలా ప్లాన్ చేశారంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరిగే చోటుకు వెళ్లి.. పోలింగ్ ప్రారంభం కావటానికి పావు గంట ముందు.. పార్టీ చెప్పిన అభ్యర్థి కంటే కూడా.. మనసుకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని కోరనున్నట్లు చెబుతున్నారు.

తాము అనుకున్నట్లు పది మంది ఎమ్మెల్యేల్ని ప్రభావితం చేసి.. యశ్వంతో సిన్హాకు పడాల్సిన ఓట్లను ద్రౌపది ముర్ముకు పడేలా చేస్తే.. కేసీఆర్ కు అదో షాకింగ్ గా మారుతుందన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి.. పది క్రాస్ ఓట్లును వేయించాలని తపిస్తున్న టీ బీజేపీ నేతల వ్యూహం ఏ మేరకు వర్కువుట్ అవుతుందో చూడాలి.