Begin typing your search above and press return to search.

టీ20 వరల్డ్ కప్: సెమీస్ లో ఓటమితో భారత్ కు వచ్చేది ఎంతంటే?

By:  Tupaki Desk   |   12 Nov 2022 1:30 PM GMT
టీ20 వరల్డ్ కప్: సెమీస్ లో ఓటమితో భారత్ కు వచ్చేది ఎంతంటే?
X
టీ20 ప్రపంచకప్‌ 2022లో గురువారం జరిగిన సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడి టీమ్‌ఇండియా టోర్నీ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించింది. కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా అడిలైడ్ ఓవల్‌లో ప్రత్యర్థి ఇంగ్లండ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడింది. 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆస్ట్రేలియాలో భారత్‌ పోరు సెమీ ఫైనల్‌ ఓటమితో ముగిసింది.

టీ20 ప్రపంచ కప్ 2022 కోసం ఐసీసీ మొత్తం $5,600,000 డాలర్లు మన భారత కరెన్సీలో చెప్పాలంటే రూ. 45 కోట్లకు పైగా ప్రైజ్ మనీని ప్రకటించింది. ఇందులో భారత్ ఓడిపోయిన సెమీ-ఫైనలిస్ట్‌కు $400,000 డాలర్లు అంటే దాదాపు రూ. 3.22 కోట్లు అందుకుంటుంది. మెన్ ఇన్ బ్లూ సూపర్ 12 దశలో నాలుగు విజయాలకు ప్రతిదానికీ అదనంగా $40,000 డాలర్లు పొందుతుంది.

అంటే మరో $160,000 లేదా రూ.1.28 కోట్లు. అందువల్ల, టోర్నమెంట్ నుండి భారతదేశం యొక్క మొత్తం ప్రైజ్ మనీ $560,000 డాలర్లు (రూ. 4.50 కోట్లు) ప్రైజ్ మనీగా అందుకుంటుంది.

టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ గెలుచుకుని ఉంటే.. ఇదే ప్రైజ్‌మనీ 400,000 డాలర్ల నుంచి 1,600,000 డాలర్లకు చేరేది. ఊహించని విధంగా రూ.12.88 కోట్లు అందుకునేది. అంటే కప్ కొడితే నాలుగు రెట్లు ఆదాయం పెరిగి ఉండేది. ఈ అతిపెద్ద బహుమతి ఈ మెగా వాటా ఇప్పుడు పాకిస్తాన్ లేదా ఇంగ్లాండ్‌కు వెళ్తుంది. ఓడిపోయిన ఫైనలిస్ట్ $800,000 (రూ. 6.44) కోట్లు గెలుచుకుంటుంది.

టీ20 ప్రపంచ కప్ 2022 నుండి సూపర్ 12 దశలో నిష్క్రమించిన ఆతిథ్య ఆస్ట్రేలియా , దక్షిణాఫ్రికా వంటి జట్లు, ప్రైజ్ మనీగా $70,000 డాలర్లు అందుకుంటుంది. రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ వంటి జట్లకు మొదటి రౌండ్‌లోనే పరాజయం పాలైంది, ప్రైజ్ మనీ $40,000 డాలర్లు అందుతుంది..

భారత్ నిష్క్రమణ తర్వాత, ఇంగ్లండ్ -పాకిస్తాన్ ఇప్పుడు నవంబర్ 13 ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో తలపడనున్నాయి. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ అందనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.