Begin typing your search above and press return to search.
అలా జరగకుండా ఉండాల్సింది , అది తప్పే క్షమించండి : మంత్రి తలసాని !
By: Tupaki Desk | 23 Sep 2020 1:30 PM GMTఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ లో వేర్వేరు ఘటనల్లో నాలాలో పడి మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర పశు సంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్షమాపణ చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగడం తప్పే, బాధిత కుటుంబాలను తప్పనిసరిగా ఆదుకుంటామని తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందునే కాంగ్రెస్ పార్టీ నాటకాలకు తెరలేపిందని విమర్శించారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 150 డివిజన్లలో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడం కూడా కష్టమేనన్నారు.
మంత్రి కేటీఆర్ పనితీరుకు కాంగ్రెస్ నేతల నుంచి ఎటువంటి సర్టిఫికెట్ అవసరం అక్కర్లేదని, హైదరాబాద్ లో ఎవరినడిగినా మంత్రి కేటీఆర్ పని తీరు ఎలా ఉందో చెబుతారని తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా మంత్రి కేటీఆర్కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత వివాదాలను కప్పి పుచ్చుకునేందుకే ఆ పార్టీ నేతలు సరికొత్త డ్రామాలు మొదలెట్టారని, వారికి పార్టీ పరంగా ఏవైనా గొడవలు ఉంటే వాళ్ళ అధిష్టానం దగ్గర తేల్చుకోవాలని చురకలు అంటించారు. తమకు ధైర్యం ఉందని, అందుకే కాంగ్రెస్ నేతలను తీసుకెళ్ళి డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం దగ్గరికి తీసుకెళ్లామని తెలిపారు. హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఒక చోట కట్టామని తాము చెబితే, కాంగ్రెస్ నేతలు మరోచోటికి వెళ్లారని చెప్పారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క లాంటి బాధ్యత గల వ్యక్తి అన్నీ తెలుసుకుని డబుల్ బెడ్ రూం ఇళ్ళ పరిశీలనకు వెళ్లాల్సిందని అన్నారు. రైతులకు తొమ్మిది గంటల కరెంటు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి ఎగ్గొట్టిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. జీహెచ్ ఎంసీ ఎన్నికలు వసున్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు డ్రామాలాడుతున్నారని విమర్శలు కురిపించారు.
మంత్రి కేటీఆర్ పనితీరుకు కాంగ్రెస్ నేతల నుంచి ఎటువంటి సర్టిఫికెట్ అవసరం అక్కర్లేదని, హైదరాబాద్ లో ఎవరినడిగినా మంత్రి కేటీఆర్ పని తీరు ఎలా ఉందో చెబుతారని తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా మంత్రి కేటీఆర్కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత వివాదాలను కప్పి పుచ్చుకునేందుకే ఆ పార్టీ నేతలు సరికొత్త డ్రామాలు మొదలెట్టారని, వారికి పార్టీ పరంగా ఏవైనా గొడవలు ఉంటే వాళ్ళ అధిష్టానం దగ్గర తేల్చుకోవాలని చురకలు అంటించారు. తమకు ధైర్యం ఉందని, అందుకే కాంగ్రెస్ నేతలను తీసుకెళ్ళి డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం దగ్గరికి తీసుకెళ్లామని తెలిపారు. హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఒక చోట కట్టామని తాము చెబితే, కాంగ్రెస్ నేతలు మరోచోటికి వెళ్లారని చెప్పారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క లాంటి బాధ్యత గల వ్యక్తి అన్నీ తెలుసుకుని డబుల్ బెడ్ రూం ఇళ్ళ పరిశీలనకు వెళ్లాల్సిందని అన్నారు. రైతులకు తొమ్మిది గంటల కరెంటు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి ఎగ్గొట్టిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. జీహెచ్ ఎంసీ ఎన్నికలు వసున్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు డ్రామాలాడుతున్నారని విమర్శలు కురిపించారు.