Begin typing your search above and press return to search.

ఇదిగిదిగో నిత్యానందుడి ‘కైలాస’ దేశం.. ప్రధానిగా తమిళ నటి?

By:  Tupaki Desk   |   7 Dec 2019 9:59 AM GMT
ఇదిగిదిగో నిత్యానందుడి ‘కైలాస’ దేశం.. ప్రధానిగా తమిళ నటి?
X
నిత్యానంద.. దేశంలో స్వామీజీగా అవతారం ఎత్తి తమిళనాడు రాష్ట్రంలో పూజలందుకున్న స్వామి. అనంతరం అమ్మాయిలపై అత్యాచారం చేశాడంటూ పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. గుజరాత్ లోనూ ఆశ్రమంలో మైనర్ అమ్మాయిలను కిడ్నాప్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. అనంతరం బెయిల్ పై విడుదలై చల్లగా దేశం దాటి వెళ్లిపోయారు. ఇప్పుడు దక్షిణ అమెరికా ఖండంలోని ఈక్వేడార్ దేశం పక్కనే ఉన్న సముద్రంలోని ఓ దీవిని కొని అక్కడే ఏకంగా ‘కైలాస’ అనే దేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. అక్కడికి తన 50 మంది శిష్యులతో వెళ్లినట్లు సమాచారం. తన దగ్గరున్న టన్నుల కొద్దీ బంగారం, నగదును కూడా తీసుకెళ్లారని ప్రచారం జరిగింది. కైలాస దేశానికి ప్రత్యేక పాస్ పోర్టు, జెండా, జాతీయ చిహ్నాలు, జెండా ఇలా అన్నింటిని తయారు చేసి ఐక్యరాజ్యసమితి ఆమోదం కోసం పంపాడని చెబుతున్నారు.

తాజాగా నిత్యానంద ప్రత్యేక దేశంపై మరో వార్త బయటకు వచ్చింది. ఆ దేశానికి తమిళ నటిని ప్రధానిని చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిత్యానంద బెంగళూరు శివారులోని ప్రధాన ఆశ్రమమైన బిడిదిలో నివాసం ఉండేవారు. అప్పుడే ఆయన శిష్యురాలిగా చేరింది తమిళ నటి. నిజానికి ఈమె తెలుగు అమ్మాయే కానీ.. తమిళంలో హీరోయిన్ గా గుర్తింపు పొందింది. తెలుగు సినిమాల్లోనూ నటించింది. అలాంటి నటి ఆ తర్వాత నిత్యానందతో చనువు పెంచుకొని ప్రధాన శిష్యురాలిగా మారింది. ఆయనతో ఈ తమిళ నటి రాసలీలలు సాగిస్తున్న వీడియోలు సైతం అప్పట్లో లీక్ అయ్యి సంచలనం సృష్టించాయి.

అయితే ఇప్పుడు సముద్రంలో నిత్యానంద ఏర్పాటు చేసుకున్న ద్వీప దేశానికి ప్రధానిగా తన శిష్యురాలు అయిన తమిళ నటిని ప్రధాని చేయాలని నిత్యానంద డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ మేరకు తన శిష్యులను ఆదేశించారని ప్రచారం జరుగుతోంది. నిత్యానందతో రాసలీలలు సాగించిన ఈ తమిళ నటి ఏకంగా దేశానికి ప్రధాని పోస్టును కొట్టేసిందనే వార్తలతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మరి ఈ వార్తలు నిజమా? కైలాసా దేశానికి నిజంగానే తమిళ నటి ప్రధాని అవుతోందా? అనేది సస్సెన్స్ గా మారింది.

అయితే తాజాగా నిత్యానంద తన ‘కైలాస’ దేశంలో ఉన్న ఫొటోలు కొన్ని బయటకు వచ్చాయి.. ఓ నీటి సరస్సు పక్కన నిత్యానంద ఠీవీగా చూస్తున్న ఫొటో రిలీజ్ అయ్యింది..తన శిష్యులతో యోగసనాల ఫొటోలు లీక్ అయ్యాయి. దీంతో కైలాస దేశం, ఆ దేశానికి తమిళ నటి ప్రధాని అవుతుందా అన్న ప్రచారానికి బలం చేకూరుతోంది. మరి దీనిపై అధికారికంగా నిత్యానంద నుంచి సమాచారం రావాల్సి ఉంది.