Begin typing your search above and press return to search.

22 నుంచి టీవైసీపీ ప్లీన‌రీ..ముఖ్య అతిథిగా జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   13 Jun 2017 11:58 AM
22 నుంచి టీవైసీపీ ప్లీన‌రీ..ముఖ్య అతిథిగా జ‌గ‌న్‌
X
ఈ నెల 22న తెలంగాణ వైసీపీ ప్లీనరీ హైదరాబాదులో జరగనుంది. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ముఖ్య అతిథిగా హాజరవుతారని టీవైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌ లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 8 వేల మంది కార్య‌క‌ర్త‌ల‌తో ప్లీనరీ నిర్వహిస్తామని చెప్పారు.
తెలంగాణ‌లో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్లీనరీలో చర్చలు జ‌రుగుతాయ‌ని శ్రీ‌కాంత్ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలను కూడా ఎత్తి చూపుతామ‌ని తెలిపారు.

కేసీఆర్ వల్లే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి భూ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఎనీవేర్ కరప్షన్ గా మారిందని శ్రీ‌కాంత్ మండిప‌డ్డారు. మియాపూర్ భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/