Begin typing your search above and press return to search.

ఏపీ - తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   20 Dec 2020 8:34 PM IST
ఏపీ - తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్
X
కష్టకాలంలో ఉన్న జగన్ సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా లాక్ డౌన్ తో కుదేలైన ఏపీ ఆర్థిక పరిస్థితికి ఊరటనిచ్చేలా ఉపశమనం కలిగించింది. కుదేలైన ఏపీ ఆర్థిక వ్యవస్థకు అదనపు రుణాలు తీసుకునేందుకు ఏపీ సర్కార్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలు చేపట్టిన సంస్కరణల కారణంగా అధిక రుణం తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ కు రూ.2525 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.2508 కోట్లు అదనపు రుణాలు పొందేందుకు కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. సులభతర వాణిజ్య సంస్కరణలు అమలు చేసినందుకు కేంద్రం ఈ వెసులుబాటు ఇచ్చింది.

తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అదనపు రుణాలు తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో మొత్తం ఐదు రాష్ట్రాలకు కలిసి రూ.16728 కోట్లు తీసుకునే వీలుంది.

ఈ ఐదు రాష్ట్రాలకు విద్యుత్ రంగ సంస్కరణలు, పట్టణ స్థానిక సంస్థలు, ఒకే దేశం-ఒకే రేషన్, అమలు చేసినందుకు గాను ఈ అదనపు రుణాలు తీసుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది.