Begin typing your search above and press return to search.

క‌ట్న పిశాచి: జీవితాంతం తోడుంటాన‌ని 25 రోజుల‌కే చంపేశాడు..

By:  Tupaki Desk   |   24 Nov 2022 9:30 AM GMT
క‌ట్న పిశాచి: జీవితాంతం తోడుంటాన‌ని 25 రోజుల‌కే చంపేశాడు..
X
అదనపు కట్నం కోసం భార్యను హతమార్చాడు ఓ భర్త. జీవితాంతం తోడుంటాన‌ని ప్ర‌మాణం చేసి పెళ్లి చేసుకున్న 25 రోజులకే ఆమె ఆయువు తీశాడు. గొంతుకోసి సంచిలో చుట్టి అడవిలో పడేశాడు. వివాహం తరువాత భార్యను అనేక వేధింపులకు గురి చేసిన అతడు..

అదనపు కట్నం కోసం ఆమెను అంతమొందించాడు. కత్తితో గొంతుకోసి చంపాడు. మృతదేహాన్ని సంచిలో కుక్కి అడవిలో పడేశాడు. పోలీసుల కథనం ప్రకారం... రాజస్థాన్ అజ్మీరా జిల్లా క్రిష్టియన్ గంజ్లోని ద్వారకాకు చెందిన ముకేశ్ సింధీకి అక్టోబర్ 29న జెన్నిఫర్ అనే మహిళతో వివాహం జరిగింది.

అప్పటి నుంచే ముకేశ్.. జెన్నిఫర్ను అదనపు కట్నం కోసం వేధించేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 23(బుధ‌వారం)న ముకేశ్ తన భార్యను హత్య చేసి పుష్కర్ అడవిలో పడేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

కాగా, బుధవారం తమకు ముకేశ్ ఇంటి నుంచి అరుపులు వినిపించాయన్నారు కాలనీవాసులు. అది జెన్నిఫర్ గొంతెనన్నారు. కొద్దిసేపటి తరువాత గోనె సంచిలో ఆమెను చుట్టేసి స్కూటీపై పెట్టుకొని బయటకు వెళ్లాడని వివరించారు. సంచిలో వెంట్రుకలు, శరీరం బయటకు కనిపించాయని, అనుమానంతో స్థానిక కౌన్సిలర్కు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ క‌ట్న పిశాచిని క‌ట‌క‌టాల వెన‌క్కి నెట్టారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.