Begin typing your search above and press return to search.

అడ‌వుల‌పై గిరిజ‌నుల‌కు స‌ర్వాధికారాలు: నిర్మ‌ల బ‌డ్జెట్

By:  Tupaki Desk   |   1 Feb 2022 7:30 AM GMT
అడ‌వుల‌పై గిరిజ‌నుల‌కు స‌ర్వాధికారాలు:  నిర్మ‌ల బ‌డ్జెట్
X
దేశవ్యాప్తంగా ఈ ఏడాది అందుబాటులోకి 5జీ సాంకేతికతను తీసుకురానున్న‌ట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ వెల్ల‌డించారు. 2022-23లో ప్రైవేటు సంస్థల ద్వారా 5జీ సాంకేతికత ప్రవేశపె డుతున్నామ‌న్నారు. 2022-23లో భారత్‌ నెట్‌ ప్రాజెక్టు ద్వారా పీపీపీ పద్ధతిలో మారుమూల ప్రాంతాలకు కూడా ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెస్తామ‌న్నారు. డీఆర్‌డీఓ, ఇతర రక్షణ పరిశోధన సంస్థల భాగస్వామ్యంతో ప్రైవేటు సంస్థలకు అవకాశం క‌ల్పిస్తామ‌న్నారు. ఎగుమతుల వృద్ధికి పారిశ్రామిక సంస్థలకు నూతన ప్రోత్సాహకాలు క‌ల్పించ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు.

మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, వినియోగంపై దృష్టి పెట్టిన‌ట్టు నిర్మ‌ల‌మ్మ తెలిపారు. రక్షణ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించి స్వయంసమృద్ధి సాధించేలా కృషి చేస్తామ‌న్నారు. విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ సంస్థల మధ్య బలమైన అనుసంధానం ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. విద్యా, పారిశ్రామిక అనుసంధానం ద్వారా నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడ‌తామ‌న్నారు. పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక గ్రీన్‌ బాండ్లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

గిఫ్ట్‌ సిటీలో ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాలకు అవకాశం క‌ల్పిస్తామ‌ని నిర్మ‌ల తెలిపారు. స్థానిక నిబంధనల నుంచి విదేశీ విద్యాసంస్థలకు మినహాయింపు ఉంటుంద‌ని.. ఇక‌, విదేశీ విద్య చేరువ అవుతుంద‌ని చెప్పారు. అవసరాల ప్రాతిపదికన ప్రత్యేక సదుపాయాలకు నిబంధనల రూపకల్పన చేశామ‌న్నారు. భారత్‌ ఆర్థిక వ్యవస్థ కరోనా ఉత్పాతాన్ని తట్టుకుని బలంగా నిలబడిందని మ‌రోసారి పున‌రుద్గాటించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు వెన్నుదన్నుగా ప్రభుత్వ పెట్టుబడులు ఉంటాయ‌ని చెప్పారు.

మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు కేంద్రసాయం చేస్తుంద‌న్నారు. దేశవ్యాప్తంగా మూలధన పెట్టుబడుల కోసం రూ.10.68 లక్షల కోట్ల కేటాయింపు జ‌రిగిన‌ట్టు నిర్మ‌ల వివ‌రించారు. దేశీయంగా సౌర విద్యుత్‌ ప్లేట్ల తయారీకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కోసం రూ.19,500 కోట్లు కేటాయింపు చేశామ‌న్నారు. బొగ్గు ద్వారా గ్యాస్‌ ఉత్పత్తి కోసం 4 పైలట్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు చెప్పారు. ప్రైవేటు రంగంలో అడవుల ఉత్పత్తి కోసం నూతన పథకం రూపొందించామ‌న్నారు. గిరిజనుల కోసం అటవీ పెంపకానికి ప్రత్యేక పథకం చేప‌డుతున్న‌ట్టు చెప్పారు. అడవుల‌పై గిరిజ‌నుల‌కు స‌ర్వాధికారాలు క‌ల్పించ‌నున్న‌ట్టు తెలిపారు.