Begin typing your search above and press return to search.
జూనియర్ ఆర్టిస్టులను వెంటాడిన మృత్యువు
By: Tupaki Desk | 18 Dec 2021 10:41 AM ISTవేగంగా దూసుకెళ్లిన కారు మూడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. హైదరాబాద్ లో ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో కారు ప్రమాదం విషాదం నింపింది. ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏకంగా ముగ్గురు మరణించడం విషాదం నింపింది. వీళ్లలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఉండడం ఇండస్ట్రీని కలవరపరిచింది.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని హెచ్.సీయూలో ఈ దారుణమైన యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. డిసెంబర్ 18న తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ మధ్యలో చెట్టును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయపడిన వ్యక్తి పేరు సిద్ధు అని తెలుస్తోంది.ఇతడు కూడా జూనియర్ ఆర్టిస్టు కావడం గమనార్హం.
సిద్దూతోపాటు కారులో మరో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. చనిపోయిన వాళ్లలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. మానస(22), మానస(21) అనే మరో అమ్మాయి ప్రాణాలు కోల్పోయారు. వాళ్లతోపాటు డ్రైవర్ అబ్దుల్లా కూడా మృతిచెందాడు.
ప్రస్తుతం తీవ్రగాయాలపాలైన సిద్ధూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని హెచ్.సీయూలో ఈ దారుణమైన యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. డిసెంబర్ 18న తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ మధ్యలో చెట్టును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయపడిన వ్యక్తి పేరు సిద్ధు అని తెలుస్తోంది.ఇతడు కూడా జూనియర్ ఆర్టిస్టు కావడం గమనార్హం.
సిద్దూతోపాటు కారులో మరో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. చనిపోయిన వాళ్లలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. మానస(22), మానస(21) అనే మరో అమ్మాయి ప్రాణాలు కోల్పోయారు. వాళ్లతోపాటు డ్రైవర్ అబ్దుల్లా కూడా మృతిచెందాడు.
ప్రస్తుతం తీవ్రగాయాలపాలైన సిద్ధూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.