Begin typing your search above and press return to search.

కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఏం మాట్లాడారంటే?

By:  Tupaki Desk   |   16 Sep 2022 11:10 AM GMT
కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఏం మాట్లాడారంటే?
X
దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు హైదరాబాద్‌లో పర్యటించారు. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ప్రభాస్ ఇంటికి వెళ్లి కలిశారు. దివంగత తెలుగు నటుడు ఉప్పలపాటి కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన ఈ ఉదయం ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకున్నారు.

రాజ్‌నాథ్ సింగ్ దివంగత నటుడి ఇంటికి చేరుకుని అక్కడ ప్రభాస్ తోపాటు కృష్ణంరాజు భార్య మరియు పిల్లలను ఓదార్చారు. రాజ్ నాథ్ సింగ్ వెంట మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కే లక్ష్మణ్ కూడా ఉన్నారు. కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కృష్ణంరాజు అనారోగ్యానికి కారణం ఏంటి? ఏయే చికిత్సలు అందించారో ఎంపీ లక్ష్మణ్ స్వయంగా రాజ్ నాథ్ కు వివరించారు. కృష్ణంరాజు సతీమణి, కుమార్తెలకు ధైర్యం చెప్పారు.

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.

కృష్ణంరాజు గతంలో వాజ్ పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా చేశారు. బీజేపీలో ఎంపీగానూ గెలిచారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆయన ఇంటికెళ్లి పరామర్శిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.