Begin typing your search above and press return to search.

మే 1 నుండి అందరికి వ్యాక్సిన్ ... ప్రైవేటు ఆస్పత్రుల అయోమయం !

By:  Tupaki Desk   |   24 April 2021 5:00 PM IST
మే 1 నుండి అందరికి వ్యాక్సిన్ ...  ప్రైవేటు ఆస్పత్రుల అయోమయం !
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఓ వైపు విజృంభిస్తుంటే.. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగం పెంచుతుంది కేంద్రం. ఇప్పటికే 45 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. మే 1 నుండి 18 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించనున్నారు. దీనితో ఇప్పటికే కరోనా బాధితులతో నిండిపోయిన ఆస్పత్రులను ఇక ముందు పెరగనున్న వ్యాక్సినేషన్‌ మరింత ఉక్కిరిబిక్కిరి చేయనుంది. మే 1 నుండి కరోనా టీకాలు వేయనుండటంతో ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రద్దీ మరింత పెరగనుంది. అసలే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత మొదలైన ప్రస్తుత సమయంలో అటు కరోనా చికిత్సలు, ఇటు వ్యాక్సినేషన్‌ను ఎలా నిర్వహించాలన్న దానిపై ఓ ప్రణాళిక లేక అయోమయంలో ఉన్నారు.

ప్రస్తుతం 45 ఏళ్లుపైబడిన వారికే టీకాలు వేస్తున్నారు. అందులో కొందరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, మరికొందరు ప్రైవేట్‌లో తీసుకుంటున్నారు. అయితే వచ్చే ఒకటో తేదీ నుంచి బహిరంగ మార్కెట్లోకి వ్యాక్సిన్‌ వస్తుండటంతో ప్రైవేట్‌ ఆస్పత్రులే టీకా బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే చికిత్సలు, వ్యాక్సినేషన్‌ ను సమన్వయం చేసుకోవడంపై ఆస్పత్రులు దృష్టిపెట్టాయి. భారీ సంఖ్యలో వ్యాక్సిన్లు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఆస్పత్రులు, క్లినిక్ లు , నర్సింగ్‌ హోంలను సిద్ధం చేయాల్సి రానుంది. ఈ మేరకు రాష్ట్రంలో 3 వేల ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్ ‌లు, నర్సింగ్‌ హోంలలో టీకాలు వేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆస్పత్రులకు అనుబంధంగా ఉండే మెడి కల్‌ షాపుల్లో టీకాలు అందుబాటులో ఉంచుతారని, వాటిలో కొనుగోలు చేసి, ఆస్పత్రిలో వేయించుకోవచ్చని అంటున్నారు.

లబ్ధిదారులు తమకు ఇష్టమైన వ్యాక్సిన్‌ వేసుకోవడానికి వీలు కల్పిస్తామని ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు చెప్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లకు అనుమతి ఉంది. తాజాగా అనుమతి పొందిన స్పుత్నిక్‌ టీకాతోపాటు త్వరలో ఫైజర్, జాన్సన్‌ అండ్‌ జాన్సన్, మోడెర్నా వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తాయని వైద్య వర్గాలు చెప్తున్నాయి. 18-44 ఏళ్ల మధ్య వయసు వారికి వచ్చే ఒక టో తేదీ నుంచి మొదలయ్యే వ్యాక్సినేషన్‌కు సం బంధించి.. ఈ నెల 28వ తేదీ నుంచే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం 28వ తేదీలోగానే వ్యాక్సినేషన్‌ కేం ద్రాల వివరాలను వైద్యారోగ్యశాఖ కోవిన్‌ పోర్టల్‌ లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉండనుంది.