Begin typing your search above and press return to search.

చిచ్చుపెట్టిన జాతీయ క్రీడా అవార్డులు

By:  Tupaki Desk   |   23 Aug 2020 1:30 AM GMT
చిచ్చుపెట్టిన జాతీయ క్రీడా అవార్డులు
X
ఇటీవల ప్రకటించిన జాతీయ క్రీడా అవార్డులు చిచ్చుపెట్టాయి. తాజాగా రెజ్లర్ సాక్షి మాలిక్ తనకు అర్జున అవార్డు దక్కకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. ఇదిప్పుడు జాతీయ స్థాయిలో దుమారం రేపింది.

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అవార్డుల కోసం 29మందిని సెలెక్ట్ కమిటీ ఎంపిక చేసింది. అయితే ఆ అవార్డు కోసం సాక్షి మాలిక్, మీరాబాయి కూడా దరఖాస్తు చేసుకోగా.. వారిని సెలెక్ట్ కమిటీ జాబితా నుంచి తొలగించింది. మిగతా వారి పేర్లు మాత్రం ఖరారు చేసింది.

ఇప్పటికే సాక్షిమాలిక్, మీరాబాయి కొన్ని ప్రముఖ అవార్డులు అందుకున్న నేపథ్యంలో సెలక్ట్ కమిటీ వారిని పక్కన పెట్టాలని భావించింది.

అయితే తాజాగా సాక్షి మాలిక్ ఈ విషయంపై స్పందించింది. ‘అర్జున అవార్డీగా పిలిపించుకోవాలని ఆరాటపడేదాన్ని. దీన్ని గెలిచేందుకు ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. 2016 ఖేల్ రత్న వచ్చినందుకు ఆనందపడ్డా.. నేను కోరుకునేది అర్జున. అదే నా డ్రీమ్’ అంటూ సాక్షి మాలిక్ ఆవేదన వ్యక్తం చేసింది.