Begin typing your search above and press return to search.

పాక్ మ్యాచ్ లో ఇండియన్స్ కళ్ళన్నీ ఆ బొద్దుగుమ్మ వైపే..!

By:  Tupaki Desk   |   11 Nov 2022 5:32 AM GMT
పాక్ మ్యాచ్ లో ఇండియన్స్ కళ్ళన్నీ ఆ బొద్దుగుమ్మ వైపే..!
X
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకుంది. సెమీ ఫైనల్ కు నాలుగు జట్లు అర్హతను సాధించాయి. గ్రూప్ ఏ నుంచి ఇండియా.. పాకిస్థాన్ జట్లు.. గ్రూప్ బీ నుంచి న్యూజిలాండ్.. ఇంగ్లాండ్ జట్లు క్వాలిఫై అయ్యారు. మంగళవారం నాడు తొలి సెమిస్ లో భాగంగా పాకిస్థాన్-న్యూజిల్యాండ్ మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. గురువారం నాడు సెకండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ విజయంతో ఇంగ్లాండ్ టీ20 ఫైనల్ చేరుకుంది. ఈ ఆదివారం మెల్ బోర్న్ వేదికగా పాకిస్థాన్-ఇంగ్లాండ్ మధ్య టీ20 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు టీ20 విజేతగా నిలువనుంది. నిన్నటి మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడం భారతీయులను ఎంతగానో నిరాశ పరిచింది. దీంతో టీం ఇండియా ప్రదర్శనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి.

ఇదిలా ఉంటే మంగళవారం నాటి పాకిస్తాన్-న్యూజిల్యాండ్ మ్యాచ్ లో ఇండియన్స్ కళ్ళన్నీ బౌండరీ వైపే ఉన్నాయి. పాకిస్తాన్ బ్యాటింగ్ ప్రదర్శనతో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. స్టేడియంలో పాక్ ఆటగాళ్లు ఆడుతుంటే ఒక వైట్ అండ్ వైట్ గర్ల్ ఆ టీంకు సపోర్ట్ చేస్తూ కనిపించింది. పాక్ ఆటగాళ్లు విజయానికి చేరువ అవుతుంటే ఈ బొద్దుగుమ్మ ప్లైయింగ్ కిస్సులతో స్టేడియంలో తెగ హల్చల్ చేసింది.

వీడియోగ్రాఫర్ ఫోకస్ మొత్తం ఈ అమ్మాయిపైనే ఉండటంతో పాక్ మ్యాచ్ కంటే ఈ వైట్ అండ్ వైట్ గర్ల్ ను చేసేందుకు ఇండియన్స్ ఆసక్తి చూపించారు. దీంతో ఈ వైట్ వైట్ గర్ల్ ఎవరా? అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ఈ వైట్ వైట్ గర్ల్ గురించి సెర్చ్ చేస్తే కొంతమేరకు మిస్టరీ వీడింది.

వైట్ అండ్ గర్ల్ లో ఉన్న ఈ అమ్మాయి పేరు నటాషా. ఆస్టేలియాలోని మెల్ బోర్న్ లో నివసిస్తున్న విదేశీ పాకిస్థానీ. మంగళవారం మ్యాచ్ లో నటషానే హైలెట్ గా నిలిచింది. ఈ అమ్మడి ఫ్లయింగ్ కిస్సులు ఫలించాయో ఏమోగానీ పాక్ ఆటగాళ్లు రెచ్చిపోయి న్యూజిల్యాండ్ పై ఆడారు. దీంతో 153 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఐదు బంతులు ఉండగానే చేధించింది.

మ్యాచ్ అనంతరం నటషా మాట్లాడుతూ ఇండియా ఫైనల్ చేరుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేసింది. ఈ రెండు జట్లు ఫైనల్లో పోటీ పడాలని.. ఇండియా విజయం సాధించాలని కోరికను వెలిబుచ్చింది. అయితే నిన్నటి మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడంతో నటషా తోపాటు ఇండియన్ ఫ్యాన్స్ నిరుత్సానికి లోనయ్యారు. ఇక ఆదివారం మ్యాచ్ లోనూ నటాషా సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో మనోళ్లు ఈ అమ్మాయి కోసమైనా ఫైనల్ మ్యాచ్ చేసే అవకాశం ఎక్కువగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.