Begin typing your search above and press return to search.

ప్రేమ పెళ్లి జరిగి 20 రోజులే.. అంతలోనే అంత ఘోరం

By:  Tupaki Desk   |   4 Dec 2019 9:55 AM GMT
ప్రేమ పెళ్లి జరిగి 20 రోజులే.. అంతలోనే అంత ఘోరం
X
హైదరాబాద్ మహానగరంలో మరో ఘోరం జరిగింది. పలు అనుమానాలు వ్యక్తమవుతున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారే అవకాశం ఉందంటున్నారు. సనత్ నగర్ కు చెందిన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మరణించిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న పూర్ణిమ కేవలం ఇరవై రోజులకే మరణించటం షాకింగ్ గా మారింది. సనత్ నగర్ కు చెందిన పూర్ణిమ తండ్రి పారిశ్రామికవేత్త. ఆయన పరిశ్రమలో దాసరి కార్తీక్ అనే యువకుడు పని చేస్తున్నాడు. అయితే.. తమ కంపెనీలో పని చేస్తున్న కార్తీక్ తో ఆమె ప్రేమ మొదలైంది.

కార్తీక్ తో పూర్ణిమ పెళ్లి చేసుకోవటాన్ని ఆమె తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోలేదు. తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటివేళ.. ఇరవై రోజుల క్రితమే కార్తీక్ తో పెళ్లి చేసుకునేందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. వారి పెళ్లి జరిగి.. విడిగా ఉంటున్నారు. కేవలం వైవాహిక జీవితాన్ని స్టార్ట్ చేసిన 20 రోజులకే పూర్ణిమ మరణించటంపై పలు సందేహాలకు తావిస్తోంది. తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లుగా పూర్ణిమ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కార్తీక్ ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటివరకూ పోలీసులు ఎలాంటి ప్రకటనా చేయలేదు.