Begin typing your search above and press return to search.

సంచయిత రాజు నేను మీ పార్టీ కాదు అంటున్నా వైసీపీకి ఆమె మీద ఇంట్రెస్ట్ ఎందుకు?

By:  Tupaki Desk   |   18 Aug 2020 6:00 PM IST
సంచయిత రాజు నేను మీ పార్టీ కాదు అంటున్నా వైసీపీకి ఆమె మీద ఇంట్రెస్ట్ ఎందుకు?
X
టీడీపీ సీనియర్ నేత, విజయనగరం మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజుకు చెక్ పెట్టేందుకు అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. అదే విజయనగరం రాజ వంశానికి చెందిన ఆనంద్ గజపతి రాజు కూతురు అయిన సంచయిత రాజుకు పెద్దపీట వేసింది. ఈ క్రమంలోనే సింహాచలం దేవస్థానం చైర్మన్ పదవిని ఇవ్వడంతోపాటు అశోక్ గజపతి ఆధీనంలో ఉన్న ‘మానస ట్రస్ట్’ బాధ్యతలను సంచయితకే కట్టబెట్టింది. ఈ రెండు పదవులను వైసీపీ ప్రభుత్వ సాయంతోనే సంచయిత చేజిక్కించుకుంది.

సంచయితకు.. టీడీపీ మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజుకి మధ్యలో ఉన్న వివాదంలో వైసీపీ తలదూర్చి సంకలు గుద్దుకుంది. అయితే సంచయిత మాత్రం తాను బీజేపీకి చెందిన నాయకురాలిని అని తెగేసి చెప్పేసింది. అయినా కూడా జిల్లాలోని వైసీపీ వాళ్లంతా అమెనే నెత్తిన పెట్టుకోవడంపై జిల్లాలో ఉన్న వైసీపీ సెకండరీ నాయకులంతా మండిపడుతున్నారట..

మన పార్టీ కాదు అని.. సంచయిత చెబుతున్నప్పుడు వైసీపీ జిల్లా నాయకులు ఆమెకే ప్రాధాన్యం ఇవ్వడం ఏంటని నిలదీస్తున్నారు. ఆమె స్వయంగా తాను బీజేపీ నాయకురాలిని అంటున్నా వైసీపీ వెనకేసుకొని రావడం కరెక్ట్ కాదు అని వైసీపీ గ్రామ నాయకులు అంటున్నారు. ఇప్పుడు జిల్లాలో ఇదే చర్చ జోరుగా నడుస్తోంది.