Begin typing your search above and press return to search.
ఆంధ్రా పౌరుషం తాకట్టు పెట్టిన వైసీపీ - టీడీపీ - జనసేన
By: Tupaki Desk | 13 Sept 2022 7:00 PM ISTఆంధ్రులు పౌరుషవంతులు. చరిత్ర పుటలలోకి వెళ్తే ఆంధ్ర పోరాటం ఏ స్థాయిలో సాగిందో తెలుస్తుంది. ఇక అధునిక చరిత్రలో స్వాతంత్ర పోరాటంలో ఆంధ్రులు ముందుండి పోరాడారు. దేశంలో ఏ ఉద్యమానికి మహాత్ముడు నాడు పిలుపు ఇచ్చినా ఆంధ్రులే తెగించి తెల్ల దొరలకు వ్యతిరకంగా ఉద్యమించిన వీర గాధలు ఎన్నో ఉన్నాయి. ఇక ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం గారి గురించి వేరగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆయన తెల్ల దొరల బానిసత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించి సైమన్ కమిషన్ తుపాకీ గుండుకు తన గుండెను ఎదురుపెట్టి పోరాడిన యోధుడు. ఇక దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత చూస్తే అదే టంగుటూరి తన కాంగ్రెస్ పార్టీకి చెందిన దేశ ప్రధాని పండిట్ నెహ్రూ మీద కూడా కొన్ని విషయాల్లో అభిప్రాయభేదాలు వస్తే వ్యతిరేకించి ఇదీ ఆంధ్రుల పౌరుషం అని చాటారని చరిత్ర చెబుతోంది.
ఇక ఒక ఎన్టీ రామారావును తీసుకుంటే ఆంధ్రుల గర్వం ఉప్పొంగుతుంది. మద్రాసీలుగా పేరుపడిన వారికి ప్రత్యేక గుర్తింపు ఢిల్లీ స్థాయిలో తెచ్చిన చరిత్ర ఆయనది. అంతే కాదు ఉక్కు మహిళగా పేరు పొంది తన కత్తికి ఎదురులేదు అని భావిస్తున్న ఇందిరా గాంధీకి ఎదురొడ్డి నిలిచి గెలిచిన రాజకీయ ధీరుడుగా జాతీయ స్థాయిలో కనిపిస్తారు. తన ప్రభుత్వాన్ని అక్రమంగా ఇందిరాగాంధీ కూల్చితే కేవలం నెల రోజుల వ్యవధిలో దాన్ని తిరిగి తెచ్చుకున్న రాజకీయ పోరాట స్పూర్తి ఎన్టీయార్ అని చెప్పుకుంటారు.
అలా ఢిల్లీ గడ్డకు తగిన సందర్భాలలో సరైన సమాధానం చెప్పిన ఖ్యాతి, మిగిలిన దేశానికి దిశానిర్దేశం చేసిన కీర్తి ఆంధ్రులది. అలాంటి ఆంధ్ర పౌరుషం ఈ రోజు ఏమైంది అన్న చర్చ అయితే రాష్ట్రం లోపలా బయటా కూడా జోరుగా సాగుతోంది. ఉమ్మడి ఏపీ విభజన నిజానికి ఆంధ్రులకు ఏ కోశానా ఇష్టం లేదు అయినా నాటి కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ రెండూ కలసి అడ్డంగా విభజించేశాయి.
సరే నాడు విభజన హామీలు అంటూ కొన్ని ఇచ్చారు. ఇప్పటికి ఎనిమిదేళ్ళు గడచినా నెరవేరుతున్నాయా అంటే లేదు అనే చెప్పాలి. ముఖ్యంగా ప్రత్యేక హోదా ఈ రోజున ఎక్కడ ఉంది అంటే జవాబు లేదు. అది ముగిసిన అధ్యాయం అని బీజేపీ అంటూంటే నోరు మెదపలేని స్థితిలో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇక పోలవరం ప్రాజెక్ట్ ని ఇన్నేళ్ళు అయినా పూర్తి చేయలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఏపీ పట్ల కేంద్రం ఉదాశీనతే అని చెప్పాలి.
అదే విధంగా ఏపీకి రాజధాని ఈ రోజుకీ లేదు. దాని వెనక కూడా కేంద్ర నిర్లక్ష్యం పూర్తిగా ఉందని అంటారు. ఢిల్లీని తలదన్నిన రాజధాని కట్టిస్తాను అన్న హామీని బీజేపీ పెద్దలు నిలబెట్టుకోలేదు. పైగా నాడు అమరావతి రాజధాని శంకుస్థాపనకు ప్రధాని వచ్చి వెళ్లారు. ఇపుడు జగన్ మూడు రాజధానులు అంటే బీజేపీ పెద్దలు చోద్యం చూస్తున్నారు.
ఏపీకి విభజన చట్టం ప్రకారం అనేక కేంద్ర పరిశ్రమలు, విద్యా సంస్థలు రావాలి. అయితే కొన్ని వచ్చినా అవి కేవలం కాగితాల మీదనే తప్ప ఎక్కడా కనిపించడలేదు. వేలలో ఇవ్వాల్సిన నిధులు అయిదు పది కోట్లతో ఏటా బడ్జెట్ లో సరిపెడితే ఈ ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఎంతకాలం పడతాయి అన్నది ఎవరికీ అంచనాకు అందని విషయం. కడపలో స్టీల్ ప్లాంట్ ఊసే లేదు. విశాఖ రైల్వే జోన్ అలాగే ఉంది.
దానికి తోడు అన్నట్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తూన్నా ఏపీ నుంచి ప్రధాన పార్టీలు కిమ్మనని పరిస్థితి. నిజానికి కేంద్రం ఇంతలా ఏపీకి అన్యాయం చేస్తూంటే అధికార వైసీపీ కనీసంగా నిలదీయలేకపోతోంది. పైగా మా మద్దతు మీకే అంటూ కీలకమైన సమయాల్లో ఇస్తూ కేంద్రంతో దోస్తీ చేయడానికే చూస్తోంది. మోడీ కోసం ఏపీ వైసీపీ నమ్మకమైన నేస్తంగా ఉందని ఎన్ని విమర్శలు వచ్చినా ఖాతరు చేయడంలేదు.
ఇక తెలుగుదేశం పార్టీని తీసుకుంటే ఆ పార్టీ తీరు కూడా అంతే అని చెప్పాలి. మోడీ కరుణా కటాక్షాలు తమకు ఉంటే చాలు వచ్చే ఎన్నికల్లో ఎలాగోలా గెలిచేస్తామన్న రాజకీయ యావ తప్ప రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనాలు సీనియర్ మోస్ట్ లీడర్ అయిన చంద్రబాబుకు అసలు పట్టడం లేదు అని అంటున్నారు. అదే విధంగా ఆయన పార్టీ టీడీపీ ఒకనాడు దేశాన్ని శాసించింది. ఇపుడు కేవలం ఆంధ్రాకే తాను పరిమితం అని చెప్పేసుకుంటూ బీజేపీకి దగ్గరకావడానికి బాబు చూస్తున్నారు.
కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా పవన్ కళ్యాణ్ భేష్ అని ఒక దశలో అనిపించారు. ప్రత్యేక హోదా ఏదీ అంటూ ఆయన అప్పట్లొ కేంద్రాన్ని చాలా గట్టిగా నిలదీశారు. పాచిపోయిన లడ్డూల మాదిరిగా ప్యాకేజి అంటూ ఒకటి ప్రకటిస్తారా అని గుడ్లురిమారు. దాంతో ఏపీకి మరో కేసీయార్ దొరికారు అని అంతా ఆనందించారు. కానీ అదే పవన్ తరువాత రోజుల్లో చప్పబడిపోయారు. 2019 ఎన్నికల్లో ఓడిపోగానే ఆయన తానుగా వెళ్ళి బీజేపీ జట్టు కట్టారు. దీంతో ఈ మూడు పార్టీలు కూడా ఏపీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేని స్థితి.
నిన్నటికి నిన్న అసెంబ్లీలో కేసీయార్ విభజన వల్ల తెలంగాణాకు రావాల్సినవి ఎన్ని, కేంద్రం ఎలా అన్యాయం చేసింది అని కేటగారికల్ గా అంతా అసెంబ్లీలో వివరించి కేంద్రాన్ని మోడీని ఎండగట్టారు. మరి అలాంటి తెగింపు కేంద్రం చేసిన అన్యాయం మీద గొంతెత్తే పరిస్థితి ఏపీలోని రాజకీయ నాయకత్వానికి ఉందా అంటే జవాబు లేదు. ఒక విధంగా ఏపీ తెలంగాణా కంటే అన్ని విధాలుగా నష్టపోయింది.
మరి ఈ నష్టాన్ని కష్టాన్ని ఎలుగెత్తి చాటేది ఎవరు అన్నది ఆంధ్రుల ప్రశ్న. ఇక ఆంధ్రుల గోస కానీ వారి పౌరుషం కానీ వినిపించకుండా ప్రధాన రాజకీయ పార్టీలు తమదైన రాజకీయం చేస్తున్నాయి అన్న విమర్శలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలీ అంటే ఆంధ్రుల పౌరుషాన్ని ఢిల్లీలో వైసీపీ, టీడీపీ జనసేన తాకట్టు పెట్టేశాయనే అంటున్నారు అంతా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
ఆయన తెల్ల దొరల బానిసత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించి సైమన్ కమిషన్ తుపాకీ గుండుకు తన గుండెను ఎదురుపెట్టి పోరాడిన యోధుడు. ఇక దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత చూస్తే అదే టంగుటూరి తన కాంగ్రెస్ పార్టీకి చెందిన దేశ ప్రధాని పండిట్ నెహ్రూ మీద కూడా కొన్ని విషయాల్లో అభిప్రాయభేదాలు వస్తే వ్యతిరేకించి ఇదీ ఆంధ్రుల పౌరుషం అని చాటారని చరిత్ర చెబుతోంది.
ఇక ఒక ఎన్టీ రామారావును తీసుకుంటే ఆంధ్రుల గర్వం ఉప్పొంగుతుంది. మద్రాసీలుగా పేరుపడిన వారికి ప్రత్యేక గుర్తింపు ఢిల్లీ స్థాయిలో తెచ్చిన చరిత్ర ఆయనది. అంతే కాదు ఉక్కు మహిళగా పేరు పొంది తన కత్తికి ఎదురులేదు అని భావిస్తున్న ఇందిరా గాంధీకి ఎదురొడ్డి నిలిచి గెలిచిన రాజకీయ ధీరుడుగా జాతీయ స్థాయిలో కనిపిస్తారు. తన ప్రభుత్వాన్ని అక్రమంగా ఇందిరాగాంధీ కూల్చితే కేవలం నెల రోజుల వ్యవధిలో దాన్ని తిరిగి తెచ్చుకున్న రాజకీయ పోరాట స్పూర్తి ఎన్టీయార్ అని చెప్పుకుంటారు.
అలా ఢిల్లీ గడ్డకు తగిన సందర్భాలలో సరైన సమాధానం చెప్పిన ఖ్యాతి, మిగిలిన దేశానికి దిశానిర్దేశం చేసిన కీర్తి ఆంధ్రులది. అలాంటి ఆంధ్ర పౌరుషం ఈ రోజు ఏమైంది అన్న చర్చ అయితే రాష్ట్రం లోపలా బయటా కూడా జోరుగా సాగుతోంది. ఉమ్మడి ఏపీ విభజన నిజానికి ఆంధ్రులకు ఏ కోశానా ఇష్టం లేదు అయినా నాటి కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ రెండూ కలసి అడ్డంగా విభజించేశాయి.
సరే నాడు విభజన హామీలు అంటూ కొన్ని ఇచ్చారు. ఇప్పటికి ఎనిమిదేళ్ళు గడచినా నెరవేరుతున్నాయా అంటే లేదు అనే చెప్పాలి. ముఖ్యంగా ప్రత్యేక హోదా ఈ రోజున ఎక్కడ ఉంది అంటే జవాబు లేదు. అది ముగిసిన అధ్యాయం అని బీజేపీ అంటూంటే నోరు మెదపలేని స్థితిలో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇక పోలవరం ప్రాజెక్ట్ ని ఇన్నేళ్ళు అయినా పూర్తి చేయలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఏపీ పట్ల కేంద్రం ఉదాశీనతే అని చెప్పాలి.
అదే విధంగా ఏపీకి రాజధాని ఈ రోజుకీ లేదు. దాని వెనక కూడా కేంద్ర నిర్లక్ష్యం పూర్తిగా ఉందని అంటారు. ఢిల్లీని తలదన్నిన రాజధాని కట్టిస్తాను అన్న హామీని బీజేపీ పెద్దలు నిలబెట్టుకోలేదు. పైగా నాడు అమరావతి రాజధాని శంకుస్థాపనకు ప్రధాని వచ్చి వెళ్లారు. ఇపుడు జగన్ మూడు రాజధానులు అంటే బీజేపీ పెద్దలు చోద్యం చూస్తున్నారు.
ఏపీకి విభజన చట్టం ప్రకారం అనేక కేంద్ర పరిశ్రమలు, విద్యా సంస్థలు రావాలి. అయితే కొన్ని వచ్చినా అవి కేవలం కాగితాల మీదనే తప్ప ఎక్కడా కనిపించడలేదు. వేలలో ఇవ్వాల్సిన నిధులు అయిదు పది కోట్లతో ఏటా బడ్జెట్ లో సరిపెడితే ఈ ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఎంతకాలం పడతాయి అన్నది ఎవరికీ అంచనాకు అందని విషయం. కడపలో స్టీల్ ప్లాంట్ ఊసే లేదు. విశాఖ రైల్వే జోన్ అలాగే ఉంది.
దానికి తోడు అన్నట్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తూన్నా ఏపీ నుంచి ప్రధాన పార్టీలు కిమ్మనని పరిస్థితి. నిజానికి కేంద్రం ఇంతలా ఏపీకి అన్యాయం చేస్తూంటే అధికార వైసీపీ కనీసంగా నిలదీయలేకపోతోంది. పైగా మా మద్దతు మీకే అంటూ కీలకమైన సమయాల్లో ఇస్తూ కేంద్రంతో దోస్తీ చేయడానికే చూస్తోంది. మోడీ కోసం ఏపీ వైసీపీ నమ్మకమైన నేస్తంగా ఉందని ఎన్ని విమర్శలు వచ్చినా ఖాతరు చేయడంలేదు.
ఇక తెలుగుదేశం పార్టీని తీసుకుంటే ఆ పార్టీ తీరు కూడా అంతే అని చెప్పాలి. మోడీ కరుణా కటాక్షాలు తమకు ఉంటే చాలు వచ్చే ఎన్నికల్లో ఎలాగోలా గెలిచేస్తామన్న రాజకీయ యావ తప్ప రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనాలు సీనియర్ మోస్ట్ లీడర్ అయిన చంద్రబాబుకు అసలు పట్టడం లేదు అని అంటున్నారు. అదే విధంగా ఆయన పార్టీ టీడీపీ ఒకనాడు దేశాన్ని శాసించింది. ఇపుడు కేవలం ఆంధ్రాకే తాను పరిమితం అని చెప్పేసుకుంటూ బీజేపీకి దగ్గరకావడానికి బాబు చూస్తున్నారు.
కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా పవన్ కళ్యాణ్ భేష్ అని ఒక దశలో అనిపించారు. ప్రత్యేక హోదా ఏదీ అంటూ ఆయన అప్పట్లొ కేంద్రాన్ని చాలా గట్టిగా నిలదీశారు. పాచిపోయిన లడ్డూల మాదిరిగా ప్యాకేజి అంటూ ఒకటి ప్రకటిస్తారా అని గుడ్లురిమారు. దాంతో ఏపీకి మరో కేసీయార్ దొరికారు అని అంతా ఆనందించారు. కానీ అదే పవన్ తరువాత రోజుల్లో చప్పబడిపోయారు. 2019 ఎన్నికల్లో ఓడిపోగానే ఆయన తానుగా వెళ్ళి బీజేపీ జట్టు కట్టారు. దీంతో ఈ మూడు పార్టీలు కూడా ఏపీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేని స్థితి.
నిన్నటికి నిన్న అసెంబ్లీలో కేసీయార్ విభజన వల్ల తెలంగాణాకు రావాల్సినవి ఎన్ని, కేంద్రం ఎలా అన్యాయం చేసింది అని కేటగారికల్ గా అంతా అసెంబ్లీలో వివరించి కేంద్రాన్ని మోడీని ఎండగట్టారు. మరి అలాంటి తెగింపు కేంద్రం చేసిన అన్యాయం మీద గొంతెత్తే పరిస్థితి ఏపీలోని రాజకీయ నాయకత్వానికి ఉందా అంటే జవాబు లేదు. ఒక విధంగా ఏపీ తెలంగాణా కంటే అన్ని విధాలుగా నష్టపోయింది.
మరి ఈ నష్టాన్ని కష్టాన్ని ఎలుగెత్తి చాటేది ఎవరు అన్నది ఆంధ్రుల ప్రశ్న. ఇక ఆంధ్రుల గోస కానీ వారి పౌరుషం కానీ వినిపించకుండా ప్రధాన రాజకీయ పార్టీలు తమదైన రాజకీయం చేస్తున్నాయి అన్న విమర్శలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలీ అంటే ఆంధ్రుల పౌరుషాన్ని ఢిల్లీలో వైసీపీ, టీడీపీ జనసేన తాకట్టు పెట్టేశాయనే అంటున్నారు అంతా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.