Begin typing your search above and press return to search.
విశాఖే రాజధాని ...జగన్ పక్క ప్లాన్ తో షిఫ్టింగ్...?
By: Tupaki Desk | 15 Nov 2022 6:00 AM ISTవిశాఖలో ముఖ్యమంత్రి హోదాలో తొలి నిద్ర చేశారు జగన్. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల విశాఖ టూర్ కోసం వైజాగ్ వచ్చారు. మోడీ వచ్చారు కాబట్టి ఒక రాత్రి ఆయన ఉన్నారు కాబట్టి జగన్ సైతం విశాఖలో ఉండాల్సి వచ్చింది. అలా తొలి నిద్ర చేయడం ద్వారా విశాఖ రాజధాని మీద ఏర్పడిన ఆటంకాలను జగన్ తొలగించేసుకున్నారు అని అంటున్నారు.
ఇక విశాఖకు ఏ క్షణమైనా తన కార్యకలాపాలను షిఫ్ట్ చేసుకోవాలని జగన్ చూస్తున్నారు అని వార్త ఒకటి గట్టిగా ప్రచారం అవుతోంది. ఎన్నికలకు ఎక్కువ సమయం లేనందువల్ల జగన్ తన కలల రాజధాని నుంచి పాలించేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు అని అంటున్నారు.
అమరావతి ఏకైక రాజధాని అంటూ ఈ ఏడాది మార్చిలో హై కోర్టు తుది తీర్పు ఇచ్చింది. దాంతో ఆరు నెలల పాటు ఆగిన జగన్ సెప్టెంబర్ లో సుప్రీం కో పిటిషన్ వేశారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు ఈ కేసుని విచారణను స్వీకరించింది కానీ వాయిదాలు పడుతోంది. లోతైన అధ్యయనం చేయాల్సి ఉన్నందువల్ల ఎపుడు ఈ కేసు పూర్తి అవుతుందో కూడా తెలియదు.
దాంతో జగన్ అయితే విశాఖకు తన పాలనను షిఫ్ట్ చేయాలని ఆరాటపడుతున్నారని అంటున్నారు. దాని కోసం ఒక మంచి ముహూర్తం ఆయన సెట్ చేసుకుని ఉన్నారని చెబుతున్నారు. రాజాయంగంలో రాజధానికి ఒక నిర్వచనం ఇవ్వలేదు. సీఎం కానీ ప్రధాని కానీ ఎక్కడ నుంచి అయినా పాలించవచ్చు. ఫైల్స్ తమ వద్దకు రప్పించుకుని క్లియర్ చేయవచ్చు. ఇపుడు జగన్ కూడా అలాగే రాజధాని అని విశాఖకు పేరు పెట్టకుండా పాలించాలని చూస్తున్నారు అని అంటున్నారు.
దాని మీద న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఉండబోవని రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారు. ఆ రకమైన స్వేచ్చ ముఖ్యమంత్రికి పూర్తిగా ఉందని అంటున్నారు. దీని వల్ల జగన్ కి రెండు లాభాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకటి తాను కోరుకున్నట్లుగా విశాఖకు రాజధానిని మార్చడం. అదే విధంగా తాను ప్రజలకు చెప్పిన మేరకు విశాఖకు క్యాపిటల్ హోదా ఇచ్చి జనాలకు దగ్గర కావడం.
ఒకసారి క్యాపిటల్ కార్యకలాపాలు సాగాక రేపటి రోజున ఎవరు అధికారంలోకి వచ్చినా దాన్ని తీసివేయలేరు. అంతే కాదు ప్రస్తుతం విశాఖ విషయంలో విభేదిస్తున్న విపక్షాలు కూడా రాజధాని అన్న పేరు లేకుండా ముఖ్యమంత్రి వెళ్ళి విశాఖ పాలిస్తూంటే ఏమీ అనలేరు. పైగా ఏ రకమైన విమర్శలు చేసినా అది వారికి రాజకీయంగా తిప్పికొడుతుంది. తాను అనుకున్నట్లుగా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నట్లుగా జగన్ చెప్పుకున్నట్లుగా ఉంటుంది.
అయితే జగన్ రాజధాని అనకుండా విశాఖలో క్యాంప్ ఆఫీస్ పెట్టి కార్యక్రమాలు అమలు చేయవచ్చు. కానీ హై కోర్టు విషయం అలా కాదు, దానికి సుప్రీం కోర్టు సిఫార్సు చేస్తే అంతిమంగా రాష్ట్రపతి ప్రకటించాల్సి ఉంటుంది. కర్నూల్ లో హై కోర్టు అన్నది మాత్రం అనుకున్నత ఈజీ కాదు. ఇక శాసన రాజధానిగా అమరావతి ఎటూ ఉంటుంది.
మొత్తానికి జగన్ దూకుడు చూస్తూంటే కొద్ది కాలంలోనే ఆయన విశాఖకు తన పాలనను మొత్తం తీసుకువచ్చేట్టుగా కనిపిస్తోంది అని అంటున్నారు. ఇక సుప్రీం కోర్టులో అమరావతి రాజధాని విషయం మొదట్లో తొందరగానే పరిష్కారం అవుతుంది అని అనుకున్నారు. కానీ ఇపుడు అక్కడ సమయం పడుతుంది అని అంటున్నారు.
కేవలం అమరావతి రాజధానికి సంబంధించి ఎనిమిది కేసులు, అలాగే విభజనకు సంబంధించి మరో 28 పిటిషన్లు విచారణకు సిద్ధంగా ఉన్నాయి. వీటిని మొదట్లో కలిపి విచారణ చేయాలని అనుకున్నా ఇపుడు విభజించి విచారణ చేస్తారని చెబుతున్నారు. ఏది ఏమైనా న్యాయ స్థానం తీర్పు ఆలస్యం అవవచ్చు. వచ్చినా అది ఏ విధంగా ఉంటుందో తెలియదు. అందుకే జగన్ తెలివిగానే పావులు కదుపుతున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
ఇక విశాఖకు ఏ క్షణమైనా తన కార్యకలాపాలను షిఫ్ట్ చేసుకోవాలని జగన్ చూస్తున్నారు అని వార్త ఒకటి గట్టిగా ప్రచారం అవుతోంది. ఎన్నికలకు ఎక్కువ సమయం లేనందువల్ల జగన్ తన కలల రాజధాని నుంచి పాలించేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు అని అంటున్నారు.
అమరావతి ఏకైక రాజధాని అంటూ ఈ ఏడాది మార్చిలో హై కోర్టు తుది తీర్పు ఇచ్చింది. దాంతో ఆరు నెలల పాటు ఆగిన జగన్ సెప్టెంబర్ లో సుప్రీం కో పిటిషన్ వేశారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు ఈ కేసుని విచారణను స్వీకరించింది కానీ వాయిదాలు పడుతోంది. లోతైన అధ్యయనం చేయాల్సి ఉన్నందువల్ల ఎపుడు ఈ కేసు పూర్తి అవుతుందో కూడా తెలియదు.
దాంతో జగన్ అయితే విశాఖకు తన పాలనను షిఫ్ట్ చేయాలని ఆరాటపడుతున్నారని అంటున్నారు. దాని కోసం ఒక మంచి ముహూర్తం ఆయన సెట్ చేసుకుని ఉన్నారని చెబుతున్నారు. రాజాయంగంలో రాజధానికి ఒక నిర్వచనం ఇవ్వలేదు. సీఎం కానీ ప్రధాని కానీ ఎక్కడ నుంచి అయినా పాలించవచ్చు. ఫైల్స్ తమ వద్దకు రప్పించుకుని క్లియర్ చేయవచ్చు. ఇపుడు జగన్ కూడా అలాగే రాజధాని అని విశాఖకు పేరు పెట్టకుండా పాలించాలని చూస్తున్నారు అని అంటున్నారు.
దాని మీద న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఉండబోవని రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారు. ఆ రకమైన స్వేచ్చ ముఖ్యమంత్రికి పూర్తిగా ఉందని అంటున్నారు. దీని వల్ల జగన్ కి రెండు లాభాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకటి తాను కోరుకున్నట్లుగా విశాఖకు రాజధానిని మార్చడం. అదే విధంగా తాను ప్రజలకు చెప్పిన మేరకు విశాఖకు క్యాపిటల్ హోదా ఇచ్చి జనాలకు దగ్గర కావడం.
ఒకసారి క్యాపిటల్ కార్యకలాపాలు సాగాక రేపటి రోజున ఎవరు అధికారంలోకి వచ్చినా దాన్ని తీసివేయలేరు. అంతే కాదు ప్రస్తుతం విశాఖ విషయంలో విభేదిస్తున్న విపక్షాలు కూడా రాజధాని అన్న పేరు లేకుండా ముఖ్యమంత్రి వెళ్ళి విశాఖ పాలిస్తూంటే ఏమీ అనలేరు. పైగా ఏ రకమైన విమర్శలు చేసినా అది వారికి రాజకీయంగా తిప్పికొడుతుంది. తాను అనుకున్నట్లుగా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నట్లుగా జగన్ చెప్పుకున్నట్లుగా ఉంటుంది.
అయితే జగన్ రాజధాని అనకుండా విశాఖలో క్యాంప్ ఆఫీస్ పెట్టి కార్యక్రమాలు అమలు చేయవచ్చు. కానీ హై కోర్టు విషయం అలా కాదు, దానికి సుప్రీం కోర్టు సిఫార్సు చేస్తే అంతిమంగా రాష్ట్రపతి ప్రకటించాల్సి ఉంటుంది. కర్నూల్ లో హై కోర్టు అన్నది మాత్రం అనుకున్నత ఈజీ కాదు. ఇక శాసన రాజధానిగా అమరావతి ఎటూ ఉంటుంది.
మొత్తానికి జగన్ దూకుడు చూస్తూంటే కొద్ది కాలంలోనే ఆయన విశాఖకు తన పాలనను మొత్తం తీసుకువచ్చేట్టుగా కనిపిస్తోంది అని అంటున్నారు. ఇక సుప్రీం కోర్టులో అమరావతి రాజధాని విషయం మొదట్లో తొందరగానే పరిష్కారం అవుతుంది అని అనుకున్నారు. కానీ ఇపుడు అక్కడ సమయం పడుతుంది అని అంటున్నారు.
కేవలం అమరావతి రాజధానికి సంబంధించి ఎనిమిది కేసులు, అలాగే విభజనకు సంబంధించి మరో 28 పిటిషన్లు విచారణకు సిద్ధంగా ఉన్నాయి. వీటిని మొదట్లో కలిపి విచారణ చేయాలని అనుకున్నా ఇపుడు విభజించి విచారణ చేస్తారని చెబుతున్నారు. ఏది ఏమైనా న్యాయ స్థానం తీర్పు ఆలస్యం అవవచ్చు. వచ్చినా అది ఏ విధంగా ఉంటుందో తెలియదు. అందుకే జగన్ తెలివిగానే పావులు కదుపుతున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.