Begin typing your search above and press return to search.

జన సేనకు రాజు గారు ఇలాంటి షాక్ ఇస్తారు అని ఊహించలేదు

By:  Tupaki Desk   |   23 Aug 2022 6:30 AM GMT
జన సేనకు రాజు గారు ఇలాంటి షాక్ ఇస్తారు అని ఊహించలేదు
X
వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు జనసేన పార్టీకి పెద్ద షాకే ఇచ్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ మధ్య ఒక ప్రత్యేక యాప్ ద్వారా రాజుగారు ఏపీలోని అన్నీ నియోజకవర్గాల్లో సర్వే చేయించారట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంలో జనాభిప్రాయం తీసుకున్నారట. ఈ సర్వేలో టీడీపీకి 90 సీట్లు వస్తుందని సర్వేలో తేలిందని ఆయనే చెప్పారు. తన సర్వేలో వైసీపీకి 90 సీట్లు వస్తుందని ఫలితం వస్తే అందరు ఆశ్చర్యపోవాలి.

రాజుగారి సర్వే ప్రకారం టీడీపీ అధికారంలోకి రావటం ఖాయం. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ప్రతిరోజు బురదచల్లేస్తున్న తిరుగుబాటు ఎంపీ నిర్వహించిన సర్వేలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఎవరు అనుకోరు.

కాబట్టి టీడీపీకే జనాలు ఓట్లేశారు. ఓకే ఇంతవరకు కరెక్టే అనుకుందాం. మరి అధికారపార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ? అన్నది సర్వేలో ఎందుకు తేలలేదు. వైసీపీ సంగతిని వదిలేసినా జనసేనకు ఎన్నిసీట్లు వస్తాయనే విషయాన్ని రాజుగారు ఎందుకు బయట పెట్టలేదు ?

చాలాకాలంగా రాజుగారు చెబుతున్నదేమంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 15 అసెంబ్లీ సీట్లకు మించిరావని. వైసీపీ ఘోరంగా ఓడిపోవాలన్నది రాజుగారి కోరికే కానీ జనాభిప్రాయం కాదు.

జనాభిప్రాయం కోసం ప్రత్యేక యాప్ సర్వేలో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తుందనే విషయాన్ని రాజుగారు ఎందుకు చెప్పలేదో అర్ధంకావటం లేదు. సరే జగన్ అంటే మండిపోతున్న రాజుగారు వైసీపీ సీట్లను బయట పెట్టలేదనే అనుకుందాం. మరి వచ్చే ఎన్నికల్లో రాజుగారు పోటీచేద్దామని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్న జనసేనకైనా ఎన్నిసీట్లు వస్తాయో చెప్పుండాల్సింది.

పైగా తన సర్వే వివరాలు చెప్పిన రాజుగారు జాతీయ మీడియా సంస్ధల సర్వే వివరాలను నమ్ముకుంటే జగన్ కు దెబ్బపడటం ఖాయమని హెచ్చరించారు. మరి జాతీయ మీడియా సర్వేలను కాకుండా తాను నిర్వహించిన సర్వేనే వాస్తవమని జగన్+జనాలు అనుకోవాలని రాజుగారి ఉద్దేశ్యమా ?