Begin typing your search above and press return to search.

మట్టి పిసుకుతున్న మణికట్టు మాయాజాలం !

టీమిండియా క్రికెట్ జట్టులో ఆడాలని ఎవరికి మాత్రం ఉండదు. బ్లూ జెర్సీతో జూలు విదిలించారని ఏ క్రికెటర్ మాత్రం కోరుకోడు.

By:  Tupaki Desk   |   5 Jun 2024 5:30 PM GMT
మట్టి పిసుకుతున్న మణికట్టు మాయాజాలం !
X

టీమిండియా క్రికెట్ జట్టులో ఆడాలని ఎవరికి మాత్రం ఉండదు. బ్లూ జెర్సీతో జూలు విదిలించారని ఏ క్రికెటర్ మాత్రం కోరుకోడు. కానీ అదృష్టం అన్ని సార్లు మన వెంట ఉండదు. అలాంటి క్రికెటరే మన

రవి బిష్ణోయ్.

జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగాలని చాలామందికి ఉంటుంది. అయితే ఆ అదృష్టం కొందరికే దక్కుతుంది. వరల్డ్ కప్ టీమ్ లో చోటు దక్కించుకోవాలని అందరూ ఎన్నో కలలు కంటారు. ఒక్కోసారి ఎంత బాగా ఆడినా దురదృష్టం వెక్కిరిస్తుంది.

యుజువేంద్ర చాహల్, కుల్ దీప్ సింగ్ లాంటి స్టార్ స్పిన్నర్ల పోటీని తట్టుకుని టీమిండియాలోకి వచ్చాడు రవి బిష్ణోయ్. తన స్పిన్ తో మేటి క్రికెటర్లను సైతం బోల్తా కొట్టించాడు. ఆడింది కొన్ని మ్యాచ్‌లే అయినా అద్భుతంగా రాణించాడు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న టీ 20 ప్రపంచకప్ లో ఇతనికి స్థానం గ్యారంటీ అని అనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు.

ప్రపంచకప్ లో చోటు దక్కకపోవడంతో రవిబిష్ణోయ్ తన సొంత గ్రామానికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే కుటుంబీకులతో మట్టి పొయ్యిని తయారు చేస్తూ ఓ ఫొటో దిగాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐపీఎల్-2024కు ముందు వరకు అద్భుతంగా రాణించిన బిష్ణోయ్ క్యాష్ రిచ్ లీగ్‌ లో మాత్రం ఫెయిలయ్యాడు. వికెట్లు తీయడం సంగతి పక్కన పెడితే భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. దీంతో అప్పటిదాకా ప్రపంచకప్ పోటీలో ఉన్న అతనిని బీసీసీఐ పక్కన పెట్టేసింది.