చరణ్‌ ను ఫస్ట్‌ నాదే చూడు అంటూ ఆదేశించిన బాలకృష్ణ!

Update: 2022-12-29 04:02 GMT
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న అన్‌ స్టాపబుల్‌ షో లో ప్రభాస్ సందడి చేసిన విషయం తెల్సిందే. ప్రభాస్ ఎపిసోడ్‌ కోసం ఫ్యాన్స్ రెండు వారాలుగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. ప్రభాస్ తో పాటు హీరో గోపీచంద్ కూడా ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌ లో సందడి చేయబోతున్నాడు.

డిసెంబర్‌ 30వ తారీకున స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ఈ ఎపిసోడ్‌ కు సంబంధించిన లీక్స్ షో పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా షో మధ్య లో రామ్‌ చరణ్ కు ప్రభాస్ కాల్‌ చేయడం.. ఆ సమయంలో బాలకృష్ణ ఫోన్ తీసుకుని మాట్లాడటం చాలా ఆసక్తిగా సాగింది అంటూ ఆసక్తికర లీక్స్ వస్తున్నాయి.

ప్రభాస్ మరియు రామ్‌ చరణ్ లు ఫోన్‌ లో మాట్లాడుకుంటూ ఉండగా.. ప్రభాస్ నుండి బాలకృష్ణ ఫోన్ ను తీసుకుని చరణ్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. తన వీర సింహారెడ్డి సినిమాను మొదట చూడమంటూ రామ్‌ చరణ్‌ ను బాలకృష్ణ ఆదేశించారని తెలుస్తోంది. వీర సింహారెడ్డి సినిమా చూసిన తర్వాత మీ నాన్న సినిమా వాల్తేరు వీరయ్య సినిమా చూడమంటూ కూడా బాలయ్య చరణ్ ను ఆదేశించాడట.

రామ్ చరణ్ తో బాలయ్య మాట్లాడుతున్న సమయంలో ప్రభాస్ గట్టిగా నవ్వాడు. అయితే రామ్‌ చరణ్ సమాధానం ఏంటీ అనేది మాత్రం క్లారిటీ లేదు. ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ అయితే కానీ బాలయ్య ఆదేశించినప్పుడు చరణ్ ఏమని సమాధానం ఇచ్చాడో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ప్రభాస్‌ అన్‌ స్టాపబుల్‌ సింగిల్‌ ఎపిసోడ్ గా కాకుండా డబుల్‌ ఎపిసోడ్‌ గా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మొదటి ఎపిసోడ్‌ రేపు స్ట్రీమింగ్‌ అవ్వబోతుండగా.. తదుపరి ఎపిసోడ్‌ ను వచ్చే వారం స్ట్రీమింగ్‌ చేస్తారట. ఇక ఇప్పటికే షూటింగ్ అయిన పవన్ కళ్యాణ్ యొక్క ఎపిసోడ్‌ ను ఈ సీజన్‌ యొక్క చివరి ఎపిసోడ్‌ గా స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News