వీడియో : బెంగళూరులోనూ కుమ్మేసిన 'లైగర్‌'

Update: 2022-08-22 06:10 GMT
విజయ్‌ దేవరకొండ 'లైగర్‌' సినిమా ప్రమోషన్ లో భాగంగా దేశ వ్యాప్తంగా ముఖ్య నగరాల్లో ప్రెస్ మీట్ లు.. ఈవెంట్ లు నిర్వహిస్తూ ఉన్నాడు. వెళ్లిన ప్రతి చోట కూడా విజయ్ దేవరకొండను చూసేందుకు విపరీతంగా జనాలు తరలి వస్తున్నారు. మొన్న ఆ మధ్య ముంబయి.. పాట్నా ల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో భారీ ఎత్తున జనాలు వచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు బెంగళూరులో కూడా లైగర్ కోసం భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.

రాష్ట్రాలు ఎన్నైనా సినిమాను ప్రేమించడంలో, స్టార్స్ ను అభిమానించడంలో మనమంతా ఒక్కటే అని నిరూపిస్తోంది విజయ్ దేవరకొండ క్రేజ్. ఏ ప్రాంతం వెళ్లినా అక్కడి వేదికలు, మాల్స్ వరదలా వచ్చే ప్రజలతో నిండిపోతున్నాయి. తాజాగా బెంగళూరులో విజయ్ దేవరకొండ పాల్గొన్న ప్రతి కార్యక్రమంలో కూడా విపరీతంగా జనాలు హాజరు అయ్యారు.

లైగర్ టీమ్ తో  బెంగళూరు వెళ్లిన విజయ్ దేవరకొండ కి అద్భుతమైన స్వాగతం లభించింది. అక్కడ పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించి అనంతరం ఈవెంట్ లో పాల్గొన్నారు. ఎయిర్ పోర్టు నుంచే అభిమానుల సందడి మొదలైంది. విజయ్ ను ఫాలో చేయడం, సెల్ఫీలు తీసుకోవడం, ఆయన దగ్గరకు పిలవగానే ఎమోషన్ అవడం ఇవన్నీ  బెంగళూరు టూర్ లో కనిపించిన దృశ్యాలు.

ఈవెంట్ నిర్వహించిన మల్టీప్లెక్స్ మాల్ మొత్తం నిండిపోయింది. విజయ్ దేవరకొండ ను చూడ్డానికి వచ్చిన అభిమానులను అదుపు చేయడం పోలీసులకు కష్టమైంది. బెంగళూరు టూర్ తర్వాత విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ....ఈ నెల అద్భుతంగా గడిచింది.

పునీత్ అన్నకు నివాళులు అర్పించడం, బెంగళూరు అభిమానులను కలుసుకోవడం ఉద్వేగంగా ఉంది. మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటా అంటూ ట్వీట్ చేయడంతో పాటు బెంగళూరు టూర్ కి సంబంధించిన విజువల్స్ ను కూడా షేర్‌ చేశాడు.

లైగర్‌ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు పూరి జగన్నాధ్‌ సినిమా ను తెరకెక్కించాడు. బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా ను ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.


Full View


Tags:    

Similar News