ఖుషి కాంబినేషన్‌.. పవన్‌, సూర్య కాంబో ఫోటో వైరల్‌

Update: 2022-11-03 05:30 GMT
పవన్‌ కళ్యాణ్ కెరీర్‌ లో బిగ్గెస్ట్‌ సూపర్‌ హిట్‌ చిత్రాల జాబితాలో ఖుషి సినిమా ఒకటి అనడంలో సందేహం లేదు. పవన్ కు యూత్‌ లో విపరీతమైన స్టార్ డమ్‌ కల్పించిన సినిమా ఖుషి అవ్వడంతో ఆయనతో పాటు ఆయన అభిమానులు కూడా ఆ సినిమాను ప్రత్యేకంగా చూస్తారు.

ఖుషి సినిమా కి ఎస్ జే సూర్య దర్శకత్వం వహించాడు. విభిన్నమైన కథా నేపథ్యం తో ఈ సినిమాను ఆయన రూపొందించాడు. ఆయన ఆ తర్వాత పెద్దగా సక్సెస్ లు అందుకోలేక పోయాడు కానీ ఎస్ జే సూర్య అంటే ఇప్పటికి కూడా చాలా మంది ఖుషి సినిమా ను గుర్తు చేసుకుంటూ ఉంటారు.

అలాంటి ఖుషి తాలూకు జ్ఞాపకాలను అభిమానులు ఎప్పుడు కూడా నెమరవేసుకుంటూనే ఉంటారు. తాజాగా ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పవన్ కళ్యాణ్ మరియు ఎస్ జే సూర్య చాలా క్లోజ్ గా ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఖుషి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మళ్లీ వీరిద్దరి కాంబోలో సినిమా కావాలని అభిమానులు కోరుకోగా కొమురం పులి సినిమాను వీరు చేసిన విషయం తెల్సిందే. అయితే ఆ సినిమా దారుణంగా నిరాశ పరిచింది.

ఆ సినిమా తర్వాత మళ్లీ వీరి కాంబో సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నామని అభిమానులు అంటున్నారు. ఈ ఫోటో చూస్తుంటే మళ్లీ ఖుషి కాంబో రిపీట్‌ అవ్వబోతుందా అనే చర్చ మొదలు అయ్యింది. ప్రస్తుతం పవన్‌ ఉన్న బిజీకి ఎస్ జే సూర్య తో సినిమా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News