జూ.ఎన్టీఆర్ ను క‌లిసిన తెలంగాణ మంత్రి.. ఎందుకంటే?

Update: 2021-07-05 12:30 GMT
తెలంగాణ రాష్ట్ర ర‌వాణాశాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ సినీ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ ను క‌లిశారు. అయితే.. ఇది రాజ‌కీయ భేటీ కాదు. ఇవాళ‌ పువ్వాడ అజ‌య్ కుమార్ కొడుకు న‌య‌న్ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా.. జూనియ‌ర్ ను క‌లిశారు. న‌య‌న్ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కావ‌డంతో.. పుట్టిన రోజు వేళ తార‌క్ ను క‌ల‌వాల‌ని కోరాడ‌ట‌.

దీంతో.. జూనియర్ అపాయింట్ మెంట్ తీసుకోవ‌డం.. వెళ్లి క‌లిసిరావ‌డం జ‌రిగిపోయింది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కూడా అక్క‌డే ఉన్నారు. మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ జూనియ‌ర్ ఎన్టీఆర్ ను శాలువాతో స‌త్క‌రించారు. న‌య‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా.. జూనియ‌ర్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ విష‌యాన్ని మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను ట్విట‌ర్ ద్వారా షేర్ చేసిన మంత్రి.. జూనియ‌ర్ ను క‌లిసిన‌ట్టు చెప్పారు. ''నా తనయుడు పువ్వాడ నయన్ పుట్టిన రోజు సందర్భంగా తారక్ గారిని మర్యాదపూర్వకంగా కలవడమైంది'' అని పోస్టు చేశారు.

ఇక‌, తార‌క్ సినిమాల గురించి చూస్తే.. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్స్ మొదలు కాగానే.. సెట్స్ లోకి అడుగు పెట్టనున్నాడు. ఆ తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో తన 30వ చిత్రం చేయబోతున్నాడు. ఇప్ప‌టికే వీరి కాంబోలో జ‌న‌తా గ్యారేజ్ చిత్రం వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యం సాధించింది. ఇప్పుడు మ‌రో సినిమా రాబోతుండ‌డంతో ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు మొద‌ల‌య్యాయి.
Tags:    

Similar News