రామ్ చరణ్ తో ఆ ప్రొడ్యూసర్.. ఏంటి మ్యాటర్?

కోలీవుడ్ లో 7 స్క్రీన్ స్టూడియోస్ తో బడా నిర్మాతగా వరుసగా పెద్ద సినిమాలు చేస్తోన్న ఎస్.ఎస్.లలిత్ కుమార్ టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టడానికి సిద్ధం అవుతున్నారు

Update: 2023-10-11 17:30 GMT

కోలీవుడ్ లో 7 స్క్రీన్ స్టూడియోస్ తో బడా నిర్మాతగా వరుసగా పెద్ద సినిమాలు చేస్తోన్న ఎస్.ఎస్.లలిత్ కుమార్ టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టడానికి సిద్ధం అవుతున్నారు. 96 సినిమాతో డిస్టిబ్యూటర్ గా అడుగుపెట్టిన లలిత్ కుమార్ శశికుమార్ హీరోగా ఆసురవాదం సినిమాతో నిర్మాతగా కోలీవుడ్ లో అడుగుపెట్టారు. తరువాత విజయ్, లోకేష్ కాంబినేషన్ లో మాస్టర్ మూవీ చేశారు.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెక్స్ట్ విజయ్ సేతుపతితో తుగ్లక్ దర్బార్ అనే మూవీ చేశారు. నెక్స్ట్ విక్రమ్, ధృవ్ విక్రమ్ కాంబినేషన్ లో మహాన్ మూవీని నిర్మించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబోలో వస్తోన్న లియో మూవీని లలిత్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చింది.

ఇప్పుడు లలిత్ కుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో మూవీ చేయడానికి సిద్ధం అవుతున్నారంట. దానికోసం ఇప్పటికే ఒక 25 కోట్ల అడ్వాన్స్ కూడా చరణ్ కి నిర్మాత ఇచ్చారంట. ఇక ఈ మూవీ కోసం దర్శకులని వెతికే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ నిర్మాత కావడంతో అక్కడి డైరెక్టర్స్ కి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఈ ప్రాజెక్ట్ కోసం ముగ్గురు దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారు కథలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంట. అయితే రామ్ చరణ్ లైన్ అప్ లో గేమ్ చేంజర్ తర్వాత ఒక్క సుకుమార్ తో కమిట్ అయిన ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. పుష్ప 2 రిలీజ్ తర్వాత సుకుమార్ చరణ్ కథపై వర్క్ స్టార్ట్ చేస్తారు. ఈ లోపు మరో సినిమాని చెర్రి చేసే అవకాశం ఉంది. గేమ్ చేంజర్ మూవీ కూడా ఈ ఏడాది ఆఖరుకి కంప్లీట్ కావొచ్చు.

తరువాత 7 స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ లో కమిట్ అయిన ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేసే అవకాశం ఎవరు సొంతం చేసుకుంటారు అనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. త్వరలో ఈ మూవీకి సంబందించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సౌత్ 'సర్కిల్ లో వినిపిస్తోంది.

Tags:    

Similar News