బాబు క్షమాపణలు చెబుతారా ?

అలాంటిది ఆయన గత నెల 18న ఎన్డీయే మీట్ లో మాట్లాడిన మాటలు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించాయి.

Update: 2024-10-02 03:44 GMT

ప్రపంచానికే దేవుడు, కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి మీద భక్తులకు ఎంతో ప్రీతిపాత్రం అయిన లడ్డూల మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇపుడు అటు తిరిగి ఇటు తిరిగి ఆయన మెడకే చుట్టుకుంటున్నాయా అన్న చర్చ సాగుతోంది.

సాధారణంగా చూస్తే చంద్రబాబు ఎపుడూ చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు. అలాంటిది ఆయన గత నెల 18న ఎన్డీయే మీట్ లో మాట్లాడిన మాటలు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించాయి. ఆ సమయంలో ఆయన తమ వంద రోజుల పాలన గురించి చెబుతూ గత అయిదేళ్ళ వైసీపీ పాలనలోని తప్పులను ఎత్తి చూపుతూ ప్రసంగం చేస్తున్నారు.

అలా ఆయన ఎన్నో అంశాలను ప్రస్తావించారు. అందులో భాగంగా ఆఖరుకు శ్రీవారి లడ్డూ ప్రసాదంలోనూ కల్తీ జరిగింది అంటూ నోరు జారారు. అది ఫ్లో లో చేశారా లేక బాబు అది కూడా ఒక ఆరోపణ అన్నట్లుగా చేశారా అన్నది పక్కన పెడితే అదే దావానలంగా మారింది.

మొదట అది వైసీపీని చుట్టుకుని అల్లకల్లోలం సృష్టించింది. అయితే వైసీపీ అనూహ్యంగా ఈ కేసు విషయంలో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఎందుకు అంటే ఇది వైసీపీ అస్తిత్వానికే అతి పెద్ద మచ్చగా మారుతోంది. దాంతో వైసీపీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చకచకా పావులు కదిపింది.

నిజానికి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినపుడు అవి అంతటి దుమారం సృష్టిస్తాయని అనుకోలేదు. అంతే కాదు వాటి మీద వైసీపీ కూడా వాయువేగంతో రియాక్ట్ అవుతుందని భావించలేదు. ఈ ఇష్యూ ఏకంగా సుప్రీంకోర్టు దాకా పోతుందని కూడా అసలు ఊహించలేదు.

అయితే సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను స్వీకరించాక చంద్రబాబు కొంత తగ్గారు. కల్తీ నెయ్యి విషయంలో ఆయన మొదట అన్న దాని మీదనే స్టికాన్ అవుతూ కల్తీ నెయ్యి లడ్డూలలో వాడారో లేక మరే దానిలో వాడారో అని కూడా కామెంట్స్ చేశారు.

అప్పటికే ఈ ఇష్యూ జనంలోకి ప్రబలంగా వెళ్ళిపోయింది. ఇక సుప్రీం కోర్టు కూడా ఎన్నడూ లేని విధంగా ఒక సీఎం స్థాయి వ్యక్తి మీద ఆయన నడుపుతున్న ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేసింది. దాంతో జాతీయ స్థాయిలో లడ్డూ ఇష్యూ మీద ఎన్నో డిబేట్లు నడిపిన జాతీయ మీడియా సుప్రీం వ్యాఖ్యల నేపధ్యంలో దాని మీద కూడా డిబేట్లు పెట్టింది.

రాజకీయ విమర్శలలో నిరాధారమై నవి ఉండొచ్చు కానీ కలియుగ దైవం మీద ఏ ఆధారం లేకుండా ఎలా ఆరోపణలు చేస్తారు అంటూ జాతీయ మీడియాలో చర్చలు సాగుతున్నాయి. దాంతో పాటు సమాంతరంగా సోషల్ మీడియాలో బాబు దేవుడికి హిందూ భక్తులకు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు

దీని మీద హ్యాష్ ట్యాగ్ తో కాంపెయిన్ కూడా ఉధృతంగా సాగుతోంది. ఈ నేపధ్యంలో ఏమి చేయాలి అన్న దాని మీద టీడీపీ కూటమి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. అయితే సుప్రీం కోర్టు ఈ నెల 3న పూర్తి విచారణ చేసి తీర్పు వెలువరిస్తుంది. అలా కీలకమైన ఆదేశాలు జారీ చేస్తుంది.

దానిని చూసిన మీదట ఎలా రియాక్ట్ అయితే బాగుంటుంది అన్నది ఆలోచించుకుంటారా అన్న చర్చ అయితే ఉంది. ఏది ఏమైనా నిన్నటి దాకా వైసీపీ మెడకు వేలాడిన లడ్డూ కత్తి ఇపుడు టీడీపీ వైపుగా వచ్చింది. దేవ దేవుడి విషయంలో ఆయన లడ్డూ విషయంలో జరుగుతున్న ప్రచారం పట్ల భక్తులు అంతా పూర్తిగా మండిపడుతున్నారు. వారికి స్వాంతన చేకూర్చకపోతే మాత్రం ఎవరికి అయినా ఇబ్బందే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News