చలపతిరావుని చివరిచూపు చూడని బాలకృష్ణ..!

Update: 2022-12-26 04:39 GMT
ఒకరోజు తేడాతో తెలుగు సినీ పరిశ్రమ ఇద్దరు గొప్ప నటులను కోల్పోయింది. టాలీవుడ్ సీనియర్ యాక్టర్ కైకాల సత్యనారాయణ మృతి చెందారని పరిశ్రమ అంతా విషాదంలో ఉండగా చలపతి రావు మరణం అందరికి షాక్ ఇచ్చింది. నైట్ డిన్నర్ చేసి అలా చెయిర్ లోనే తన ప్రాణాలు వదిలారని తనయుడు రవి బాబు చెప్పారు. తన తండ్రి ఇంత సడెన్ గా తమని వదిలి వెల్తారని అసలు ఊహించలేదని రవి బాబు బాధపడ్డారు. టాలీవుడ్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చిన ఆయన మెయిన్ విలన్ గా కూడా చేశారు.

ఎన్.టి.ఆర్ వీరాభిమాని అయిన చలపతిరావు భౌతిక ఖాయాన్ని చూసేందుకు నందమూరి బాలకృష్ణ రాలేకపోయారు. చిరంజీవి, వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్, గోపీచంద్ లాంటి హీరోలు వచ్చి చలపతి రావు భౌతిక ఖాయాన్ని దర్శించారు. బాలయ్య మాత్రం రాలేకపోయారు.

అయితే వీర సింహా రెడ్డి షూటింగ్ లో ఉండటం వల్లే బాలకృష్ణ రాలేకపోయారని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం శృతి హాసన్ డేట్స్ అడ్జెస్ట్ చేయగా అవి మిస్ అయితే మళ్లీ ఆమె దొరకడం కష్టమని పూర్తి చేశారట. అందుకే చలపతిరావు భౌతిక ఖాయాన్ని చూసేందుకు బాలకృష్ణ వచ్చే అవకాశం లేదని అంటున్నారు.

అమెరికా నుంచి చలపతి రావు ఇద్దరు కూతుళ్లు వచ్చిన తర్వాతనే మిగతా కార్యక్రమం చేస్తారని రవి బాబు చెప్పారు. బుధవారం మహా ప్రస్థానంలో అంతిమ సంస్కారం జరుగుతుందని అన్నారు. ఒకవేళ ఆ టైం లో చలపతి రావుకి బాలకృష్ణ చివరి రెస్పెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందేమో చూడాలి.

ఇక పరిశ్రమలో ఎవరు మృతి చెందినా సరే నాగార్జున మాత్రం చివరి చూపు చూసేందుకు వెళ్లరు. ఆయన ఎలాగు రారు కాబట్టి నాగార్జున గురించి డిస్కషన్ పెట్టలేదు కానీ బాలకృష్ణ చలపతి రావుని చివరి సారి చూసేందుకు ఎందుకు రాలేదా అని చర్చిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News