రజినీ వైఫ్ గా అలనాటి బాపు బొమ్మ

Update: 2017-06-18 07:38 GMT
బాపు సినిమాల్లో హీరోయిన్ గా ఒక్కసారి నటిస్తే విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంటుంది. తెలుగు మహిళే అయినా.. ఓ తమిళ్ సినిమాతో అరంగేట్రం చేసిన ఈశ్వరి రావు.. జగన్నాటకం చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఐదేళ్లకు మళ్లీ తెలుగులో బాపు సినిమా రాంబంటులో యాక్ట్ చేసిన తర్వాత చాలానే ఆఫర్స్ వచ్చాయి.

కానీ సినిమాల ఎంపికలో బాగా సెలెక్టివ్ గా ఉండే ఈశ్వరి రావు.. ఇప్పుడు మళ్లీ సెన్సేషన్ అయిపోతోంది. రజినీకాంత్ లేటెస్ట్ మూవీ కాలా కరికులన్ లో.. ఆయనకు భార్యగా నటిస్తోంది ఈశ్వరీ రావు. 'ఈ పాత్రలో.. నన్ను బిగ్ స్క్రీన్ పై చూడడం.. నా పిల్లలకు నేనిచ్చే ఓ అరుదైన గిఫ్ట్.. ఇంతకు మించి ఈ పాత్ర గురించి ఏమీ చెప్పలేను' అంటోందీ సీనియర్ నటి. ఎంతటి క్రేజ్ వచ్చినా.. ఎన్ని ఆఫర్స్ వచ్చినా.. మూవీస్ ఎంచుకోవడంలో మాత్రం తాను చాలా అంశాలకు ప్రాధాన్యత ఇస్తానంటున్న ఈమె.. అప్పుడప్పుడూ మాత్రమే సినిమాలు చేస్తుండడం విశేషం.

భద్ర మూవీలో ప్రకాష్ రాజ్ భార్యగా నటించిన తర్వాత.. మళ్లీ లెజెండ్ వరకూ సినిమా చేయలేదు. ఆంధ్రాపోరీ.. బ్రహ్మోత్సవం చిత్రాలలో కనిపించిన ఈశ్వరీరావు... రీసెంట్ గా అఆ.. నేను లోకల్.. ఇజం.. చిత్రాలలో నటించి మెప్పించడం విశేషం. ఇప్పటివరకూ హీరోకు అమ్మ పాత్రలలో వరుసగా కనిపించిన ఈశ్వరిరావుకు.. ఒక్కసారిగా రజినీకాంత్ సినిమాలో.. మెయిన్ రోల్ కు జోడీగా నటించే ఛాన్స్ రావడం విశేషంగానే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News