ఈ సినిమా చేస్తే నా తల్లిదండ్రుల ముందు తలెత్తుకోలేను

Update: 2021-07-05 08:30 GMT
ఇమ్రాన్ ఖాన్ హీరోగా అభినయ్‌ డియో దర్శకత్వంలో రూపొందిన ఢిల్లీ బెల్లి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీ నేపథ్యంలో రూపొందిన ఆ అడల్ట్‌ కంటెంట్ సినిమా ను బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్ ఖాన్ నిర్మించాడు. ఆ సినిమా కథను అభినయ్‌ డియో చెప్పిన సమయంలో అమీర్ ఖాన్‌ మనసులోకి రణబీర్‌ కపూర్ వచ్చాడట. ఈ కథకు అతడు పూర్తి న్యాయం చేస్తాడనే నమ్మకంతో అతడి వద్దకు కథను పంపించారు. దర్శకుడు అభినవ్‌ డియో స్వయంగా వెళ్లి రణబీర్‌ కపూర్‌ ను కలిసి సుదీర్ఘ సమయం పాటు కథను వినిపించాడట. ఆ సమయంలో అమీర్ ఖాన్‌ కూడా రణబీర్‌ కపూర్‌ తో మాట్లాడాడు అని సమాచారం.

కథలో కొంత బోల్డ్‌ కంటెంట్ ఉంది.. ముఖ్యంగా కొన్ని బూతు పదాలను సినిమాలో వాడాల్సి ఉంటుంది. మెట్రో బూతులు ఆ సినిమాలో కలిగి ఉంటాయి. దాంతో రణబీర్ కపూర్ సినిమాను తిరష్కరించాడట. సినిమా విడుదల సమయంలో ప్రీమియర్ వేస్తే తన తల్లిదండ్రులతో ఈ సినిమాను నేను ఎలా చూడగలను.. వారి ముందు ఈ సినిమా తర్వాత తలెత్తుకోలేను కదా అంటూ రణబీర్ కపూర్‌ సినిమా ను వద్దనుకున్నాడట. కథ నచ్చినా కూడా అంతా ఏమనుకుంటారో అనే ఉద్దేశ్యంతో నో చెప్పినట్లుగా ఆయన పేర్కొన్నాడు.

ఢిల్లీ బెల్లి సినిమా కథ ఆ తర్వాత ఒక్కరు ఇద్దరు వద్దకు వెళ్లినా ప్రయోజనం లేక పోయింది. ఆ సమయంలో అమీర్ ఖాన్‌ మనసులోకి ఇమ్రాన్ ఖాన్ వచ్చాడు. తన మేనల్లుడు అయిన ఇమ్రాన్‌ ఖాన్‌ తో ఆ సినిమాను చేసి అమీర్ ఖాన్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా తో ఇమ్రాన్‌ ఖాన్‌ కు కూడా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలను చేస్తున్నాడు. ఢిల్లీ బెల్లీతో పాటు పలు పెద్ద సినిమాల్లో నటించిన ఇమ్రాన్‌ ఖాన్‌ ఒకానొక సమయంలో బాలీవుడ్ బిగ్ స్టార్స్ తో కూడా వర్క్‌ చేశాడు. కాని కొన్ని కారణాల వల్ల ఇమ్రాన్ ఖాన్ సినిమాలకు దూరం అయ్యి విదేశాల్లో సెటిల్‌ అయ్యాడు.
Tags:    

Similar News