అన్‌ స్టాపబుల్‌ : కేటీఆర్‌ - రామ్‌ చరణ్‌.. ఎన్టీఆర్‌ - కళ్యాణ్ రామ్‌

Update: 2023-01-04 06:30 GMT
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న అన్‌ స్టాపబుల్‌ షో తెలుగు ఓటీటీ లో దూసుకు పోతుంది. బాలయ్య టాక్ షో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. బాలయ్య ను చాలా కొత్తగా ఈ షో లో చూడటంతో పాటు ఎంతో మంది స్టార్స్ మరియు సెలబ్రెటీలను బాలయ్య ఇంటర్వ్యూ చేసే విధానం ఇంకా ఆటలు ప్రేక్షకులను తెగ ఎంటర్‌ టైన్ చేస్తున్నాయి.

ప్రభాస్ గెస్ట్‌ గా వచ్చిన అన్‌ స్టాపబుల్ ఎపిసోడ్‌ కు ఇటీవల ఏ స్థాయిలో ఆధరణ వచ్చిందో తెల్సిందే. ఇక పవన్ కళ్యాణ్ యొక్క ఎపిసోడ్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్‌ కళ్యాణ్ యొక్క అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న సమయంలో తాజాగా మరో ఆసక్తికర అప్‌డేట్‌ ను అన్‌ స్టాపబుల్‌ టీం ఆఫ్‌ ది రికార్డు వెళ్లడించారు.

అన్‌ స్టాపబుల్‌ సీజన్‌ 2 ముగింపు దశకు వచ్చిందని.. మూడవ సీజన్ లో అరుదైన గెస్ట్‌ లను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా పేర్కొన్నారు. రామ్‌ చరణ్ మరియు కేటీఆర్‌ కలిసి బాలయ్య అన్ స్టాపబుల్‌ లో సందడి చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ సీజన్ లోనే వారి ఎపిసోడ్‌ ఉండే అవకాశం ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్‌ ల యొక్క ఎపిసోడ్‌ మాత్రమే కాకుండా సీజన్‌ 3 లో మరో ఇంట్రెస్టింగ్‌ ఎపిసోడ్‌ ఎన్టీఆర్‌ మరియు కళ్యాణ్‌ రామ్‌ తో ఉండే అవకాశం ఉందని కూడా ఆహా టీమ్‌ పేర్కొంది. బాబాయి తో ఇద్దరు అబ్బాయిల ఎపిసోడ్‌ ను మొదటి సీజన్ నుండి కూడా నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదే జరిగితే కచ్చితంగా బాలయ్య షో కి మళ్లీ రికార్డులు బ్రేక్‌ అవ్వడం ఖాయం.

బాలకృష్ణ ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాను ప్రమోట్‌ చేస్తూ ఒక ఎపిసోడ్‌ ఉండే అవకాశం ఉందట. మొత్తానికి రాబోయే అన్ స్టాపబుల్‌ ఎపిసోడ్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను కలిగి ఉన్నాయి. ప్రతి ఒక్కరిని ఎంటర్ టైన్ చేసే విధంగా అన్‌ స్టాపబుల్‌  రాబోయే ఎపిసోడ్స్ ఉంటాయని ఆహా వారు నమ్మకంగా అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News