లీక్ లీక్.. రాజ‌మౌళితో మ‌హేష్ ఊహాతీతం అనేలా

Update: 2022-04-15 03:46 GMT
బాహుబ‌లి ఫ్రాంఛైజీ త‌ర్వాత ఆర్.ఆర్.ఆర్ తో సంచ‌ల‌నాల్ని కొన‌సాగించారు ద‌ర్శ‌కధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి. నెక్ట్స్ ఏంటీ అనేదానికి ఇప్ప‌టికే అత‌డి వ‌ద్ద స‌మాధానం ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ కొన‌సాగించిన స‌క్సెస్ గ్రాఫ్ ని మునుముందు మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్ల‌డ‌మే అత‌డి ధ్యేయం. ఈసారి టార్గెట్ -ఎక్స్ ఒక రేంజులో ఉంద‌న్న‌ది తాజా గుస‌గుస‌.

ఇప్ప‌టివ‌ర‌కూ మ‌హేష్ కోసం రాజ‌మౌళి- విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఎంచుకున్న క‌థాంశం ఏమిటో అభిమానుల‌కు క్లారిటీ లేదు. త‌దుప‌రి సూప‌ర్ స్టార్ మ‌హ‌ష్ కోసం స్క్రిప్టును రెడీ చేస్తున్నారు. ఈ స్క్రిప్ట్ ఎలా ఉండ‌బోతోంది? అంటే.. మాస్ట‌ర్ మైండ్ స‌రైన వేలోనే ఆలోచిస్తున్నార‌నే టాక్ ఉంది.

మ‌హేష్ కోసం ద‌ర్శ‌క‌ధీరుడు స్పై థ్రిల్ల‌ర్ క‌థాంశాన్ని ఎంచుకున్నార‌ని లీక్ అందింది.  ఇందులో మ‌హేష్ `రా ఏజెంట్` గా క‌నిపిస్తారు. ఈ మూవీ జేమ్స్ బాండ్ 007 త‌ర‌హాలోనే మ‌రో లెవ‌ల్లో ఉంటుంద‌న్న గుస‌గుసా వినిపిస్తోంది. పైగా ఈ సినిమాకి ప్రిడేట‌ర్ - మ్యాట్రిక్స్ త‌ర‌హా సైన్స్ ఫిక్ష‌న్ ఎలిమెంట్ ని జోడిస్తార‌ని టాక్ వినిపిస్తోంది.

ఈ ఎలిమెంట్ ని ప్ర‌ధాన క‌థాంశానికి యాడ‌ప్ చేసేందుకు జ‌క్క‌న్న చాలా క‌స‌ర‌త్తు చేయ‌బోతున్నారు. ఇందులో టైమ్ ట్రావెల్ ఎలిమెంట్ కూడా మ‌రో హైలైట్ గా నిలుస్తుంద‌ని గుస‌గుస‌. భూత భ‌విష్యత్ వ‌ర్త‌మాన కాలాల్లో మ‌హేష్ ట్రావెలింగ్ మెస్మ‌రైజ్ చేస్తుంద‌న్న టాక్ కూడా ఉంది. ఈ సినిమా కోసం దాదాపు 400 కోట్ల మేర వెచ్చించ‌నున్నార‌న్న గుస‌గుస కూడా వినిపిస్తోంది. ఇక ఇప్ప‌టికే స్పై థ్రిల్ల‌ర్ క‌థాంశాల‌తో అడివి శేష్ ప్రయోగం చేసి స‌క్సెస‌య్యాడు.

త‌దుప‌రి అక్కినేని అఖిల్ ఏజెంట్ లో స్పై పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. వాట‌న్నిటి కంటే భారీ బ‌డ్జెట్ తో విజువ‌ల్ గ్రాండియారిటీ తో మ‌హేష్ న‌టించ‌నున్న స్పై థ్రిల్ల‌ర్ ఉంటుంద‌న్న‌మాట‌.

మ‌హేష్ న‌టించిన స‌ర్కార్ వారి పాట చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం మ‌హేష్ - ప‌ర‌శురామ్ టీమ్ స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. బ్యాంక్ కుంభ‌కోణం నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే క‌థాంశంతో ప‌ర‌శురామ్ ఈ చిత్రాన్ని మ‌రో లెవ‌ల్లో తెర‌కెక్కిస్తున్నార‌ని స‌మాచారం
Tags:    

Similar News