నల్ల మొసళ్లు సేఫ్.. పిచ్చి చేపలు ఫట్

Update: 2016-11-18 10:03 GMT
సినీ మాటల రచయిత  పరుచూరి గోపాలకృష్ణ ప్రధాని మోడీపై భారీ సెటైర్ వేశారు. దేశమంతటినీ ప్రభావితం చేస్తున్న నోట్ల రద్దు ఇష్యూపై ఆయన వేసిన సెటైర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సినీ ప్రముఖులు చాలామంది మోడీ నిర్ణయాన్ని ప్రశంసించగా పరుచూరి మాత్రం సున్నితమైన చురకవేశారు. పిట్ల కథతో ఆయన సోషల్ మీడియాను షేక్ చేసేశారు.

దేశంలో తలెత్తిన తాజా పరిణామాలపై పరుచూరి పిట్ట కథ ఒకటి చెప్పారు. ఓ రైతును ఉదాహరణగా తీసుకుని ఆయన రాసిన రెండు లైన్ల నీతి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. ''చెరువులో మొసలి ఉందని నీళ్లు మొత్తం తోడించేశాడు రైతు!. చేపలు చచ్చిపోయాయి!.. మొసలి పారిపోయింది. ఈ కథలో నీతి ఉంది కనిపెట్టండి.""  అంటూ పరుచూరి గోపాలకృష్ణ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. జనానికి విషయం అర్థమై దాన్ని షేర్ చేస్తున్నారు.

నల్లడబ్బు ఉన్నవారిని కట్టడి చేయాల్సింది పోయి అందరినీ ఇబ్బందులు పెడుతుండడం.. నల్లధనవంతులు మాత్రం అడ్డదారిలో తమ డబ్బును కాపాడుకుంటుండడంపై ఆయన వేసిన సెటైర్ వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News