రూ.2 కోట్లతో నిజంగానే 'ఎక్స్‌ట్రార్డినరీ'...!

నితిన్‌, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఎక్స్‌ట్రార్డినరీ'. ఈ సినిమా డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Update: 2023-11-27 06:00 GMT

నితిన్‌, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఎక్స్‌ట్రార్డినరీ'. ఈ సినిమా డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల సమయం దగ్గర పడుతున్నా కొద్ది సినిమాపై అంచనాలు పెంచే విధంగా యూనిట్ సభ్యులు పబ్లిసిటీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.

తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయాన్ని యూనిట్ సభ్యులు వెళ్లడించారు. అదేంటి అంటే.. ఈ సినిమాలోని ఒక పాటను ఏకంగా రెండు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి చిత్రీకరించారట. ఆ పాటలోని సెట్‌ తో పాటు డాన్సర్స్, కాస్ట్యూమ్స్ ఇలా అన్ని కూడా ప్రేక్షకులకు కన్నుల విందు చేసే విధంగా ఉంటాయని అంటున్నారు.

విదేశాల నుంచే కాకుండా పదుల సంఖ్యలో ముంబయి డాన్సర్స్ ను కూడా ఈ పాటలో చూపించబోతున్నారట. నితిన్ మరియు శ్రీలీలపై చాలా ఎనర్జిటిక్ గా సాగే ఈ పాటకు జానీ మాస్టర్ మాస్‌ స్టెప్పులను సమకూర్చారట. వందల కొద్ది డాన్సర్స్ తో సాగే ఈ పాట చాలా గ్రాండ్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో పెద్ద మొత్తంలో ఖర్చు చేశారని సమాచారం అందుతోంది.

నితిన్ వంటి మీడియం రేంజ్ హీరో సినిమాలో ఈ రేంజ్‌ లో ఖర్చు చేసిన పాట ఉండటం కచ్చితంగా సినిమాకు అదనపు ఆకర్షణ అనడంలో సందేహం లేదు. సినిమాపై నితిన్ చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. కథ మరియు స్క్రిప్ట్‌ విషయంలో సుదీర్ఘమైన చర్చలు, సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ సినిమా మొదలైంది.

రచయితగా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్ లు ఉన్న వక్కంతం వంశీ కి దర్శకుడిగా మాత్రం ఇప్పటి వరకు నిరాశే ముంది. ఈ ఎక్స్‌ట్రార్డినరీ చిత్రంతో కచ్చితంగా ఆ లోటు తీరుతుంది, తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా ఆయన సన్నిహితులు ధీమాతో కనిపిస్తున్నారు. శ్రీలీల, నితిన్‌, వంశీకి ఈ సినిమా సక్సెస్‌ చాలా కీలకం. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News