తొమ్మిది కోట్లు అపార్ట్ మెంట్ అమ్మేసిన న‌టుడు!

బాలీవుడ్ న‌టుల పెట్టుబ‌డులు అధిక శాతం ముంబై లోని అపార్ట్ మెంట్ ల‌పై నే ఉంటుంది.

Update: 2024-08-22 16:30 GMT

బాలీవుడ్ న‌టుల పెట్టుబ‌డులు అధిక శాతం ముంబై లోని అపార్ట్ మెంట్ ల‌పై నే ఉంటుంది. చేతిలో డ‌బ్బు ఉన్న‌ప్పుడు కొన‌డం...అవ‌స‌రం అనుకుంటే అమ్మేయ‌డం అంతే వేగంగా జ‌రుగుతుంటాయి. తాజాగా మ‌నోజ్ బాజ్ పాయ్ ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌ను రూ. 9 కోట్లు అమ్మేసిన‌ట్లు తెలుస్తోంది. 54 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించి కొనుగోలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం ఆగస్టులో ఇది సేల్ జ‌రిగింది.

ఈ అపార్ట్‌మెంట్ మినర్వాలో ఉంది. లోఖండ్‌వాలా కటారియా కన్‌స్ట్రక్షన్స్ కి చెందిన విలాసవంతమైన రెసిడెన్షియల్ టవర్ లో ఉంది. ఈ అపార్ట్ మెంట్ ను మ‌నోజ్ బాజ్ పాయ్ ప‌దేళ్ల క్రితం త‌న భార్య షబానా బాజ్‌పేయితో కలిసి కొనుగోలు చేసారు. ఈ జంట దీన్ని రూ. 32 లక్షల స్టాంప్ డ్యూటీతో రూ.6.4 కోట్లకు కొనుగోలు చేశారు. అప్పట్లో రూ.30,000 రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించారు.

తాజాగా మూడు కోట్ల లాభంతో అమ్మకం జ‌రిపారు. ఈ అపార్ట్ మెంట్ ఎంతో ల‌గ్జీరియ‌స్ గా ఉంటుంది. అత్యాధునిక స‌దుపాయాలు ఇందులో ఉన్నాయి. ఈ అపార్ట్‌మెంట్ 1,247 చదరపు అడుగుల్లో ఉంది. అదనంగా 240 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్ల పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇందులో రెండు కార్లు పార్క్ చేసుకునే వెసులు బాటుంది ఉంది.

ఇక మ‌నోజ్ బాజ్ పాయ్ న‌టుడిగా సెంచ‌రీ కొట్టిన సంగ‌తి తెలిసిందే. తన 100వ చిత్రం `భయ్యా జీ` మేలో రిలీజ్ అయింది. కానీ ల్యాండ్ మార్క్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. ప్ర‌స్తుతం ప‌లు సినిమాలు..వెబ్ సిరీస్ ల‌తో బిజీగా ఉన్నాడు.

Tags:    

Similar News