పాన్ ఇండియా 'మట్కా'.. పుకార్లకు వరుణ్ చెక్

"మట్కా మూవీకి సంబంధించి ఇప్పటికే 35 రోజులపాటు షూటింగ్ చేశాం. రామ్ తాళ్లూరి గారు నాకు సన్నిహితులు కావడంతో ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా చేరారు.

Update: 2024-02-19 08:21 GMT

మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ తన కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రయోగాత్మక కథలను ఎంచుకుంటూ వెళ్తున్నారు. సినిమాలు ఫ్లాప్ అవుతున్నా.. స్టోరీ సెలక్షన్ లో తన ఛాయిస్ మాత్రం మార్చుకోవడం లేదు. అలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంతో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే రెండు సార్లు సాలిడ్ రిలీజ్ డేట్ మిస్ చేసుకున్న ఈ మూవీ.. మార్చి 1వ తేదీన రిలీజ్ కానుంది.

మేకర్స్ చేస్తున్న ప్రమోషన్స్ తో ఆపరేషన్ వాలెంటైన్ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. కానీ ఇంతలో వరుణ్ నటిస్తున్న మరో మూవీ మట్కా ఆగిపోయిందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపించాయి. బడ్జెట్ ఎక్కువ అవుతుందని, అందుకే ఈ సినిమా ఆపేశారని వినిపించింది. దీంతో వరుణ్.. తన ఆపరేషన్ వాలెంటైన్ ప్రమోషన్స్ లో మట్కా మూవీపై స్పందించారు.

"మట్కా మూవీకి సంబంధించి ఇప్పటికే 35 రోజులపాటు షూటింగ్ చేశాం. రామ్ తాళ్లూరి గారు నాకు సన్నిహితులు కావడంతో ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా చేరారు. ఆపరేషన్ వాలెంటైన్ ప్రమోషన్స్ ముగించుకుని మళ్లీ మట్కా సినిమా షూటింగ్ లో పాల్గొంటాను. ఈ మూవీ బడ్జెట్‌ ఎక్కువ అవ్వలేదు, సినిమా ఆగిపోలేదు" అని వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు.

పాన్ ఇండియా లెవెల్ లో వరుణ్ తేజ తొలిసారి నటిస్తున్న ఈ మూవీని పలాస సినిమా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. 1958-1982 మధ్య జరిగిన కథతో సినిమా తెరకెక్కిస్తుండడంతో అప్పటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మేకర్స్ పెద్ద సెట్లు రూపొందించారు. అందులోనే కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకు నలుగురు ఫైట్ మాస్టర్లు పనిచేస్తున్నారు.

మరోవైపు, ఈ సినిమాలో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నోరా ఫతేహితోపాటు మీనాక్షి చౌదరీ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ రానుందని సమాచారం.

Tags:    

Similar News