రాత‌లు వెన‌క్కి తీసుకోలేదు..అందుకే న్యాయ పోరాటం!

తాజాగా ఈ వివాదంపై రాజ్ కుంద్రా జుహూ పోలీస్ స్టేష‌న్ లో కేసు పైల్ చేసాడు. త‌న ప్ర‌తిష్ట‌ను ఉద్దేశ పూర్వ‌కంగా దిగ‌జార్చుతున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Update: 2024-10-15 20:30 GMT

బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా పేరు కొంత కాలంగా హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. అశ్లీల వీడియోల వ్య‌వ‌హారం ద‌గ్గ‌ర నుంచి కుంద్రా పేరు మ‌రింత ఫేమ‌స్ అయింది. మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్నాడు. ఇలా అన్ని ర‌కాలుగా రాజ్ కుంద్రా పేరు మారుమ్రోగుతోంది. ఇటీవ‌లే ఓ యూట్యూబ్ ఛానెల్ త‌న‌ని టార్గెట్ చేసి త‌ప్పుడు క‌థ‌నాలు, రాయిస్తుంద‌ని రాజ్ కుంద్రా ఆరోపించాడు.

తాజాగా ఈ వివాదంపై రాజ్ కుంద్రా జుహూ పోలీస్ స్టేష‌న్ లో కేసు పైల్ చేసాడు. త‌న ప్ర‌తిష్ట‌ను ఉద్దేశ పూర్వ‌కంగా దిగ‌జార్చుతున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 'ఈ కంప్లైంట్ ఇవ్వ‌డానికి కార‌ణం స‌ద‌రు మీడియా క‌థ‌నాలే. ప‌రువుకు భంగం క‌లిగించే క‌థ‌నాలు ప్ర‌చురించి ప్ర‌తిష్ట దెబ్బ‌తీసారు. ఆ రాత‌ల‌ను వెన‌క్కి తీసుకునేందుకు అవ‌కాశం ఇచ్చినా ప్ర‌యోజ‌నం లేదు. నేను న్యాయ పోరాటం చేస్తున్నా.

మీడియా విచార‌ణ‌కు నేను బ‌లికాను' అని పేర్కొన్నారు. మొన్న‌టి వర‌కూ రాజ్ కుంద్రా వివిధ ఆరోప‌ణ‌లో కోర్టు చుట్టూ తిరిగిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న ప‌రువు కోసం మ‌ళ్లీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వ‌స్తోంది.

బంగ్లాదేశ్ కు చెందిన న‌టి రియా బ‌ర్డేకు సంబంధించిన అక్ర‌మ వ‌ల‌స కేసుతో ముడిపెడుతూ ఓ వార్తా క‌థ‌నం యూట్యూబ్ లో వైర‌ల్ అయింది. రియా బ‌ర్డే ఓ శృంగార తార‌. ఇటీవ‌లే ఆమెని మ‌హారాష్ట్ర‌లో అరెస్ట్ చేసారు.

న‌కిలీ ప‌త్రాలు ఉపయోగించి భార‌త్ లో అక్ర‌మంగా నివ‌సిస్తున్నందుకు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. ఇక రాజ్ కుంద్రా దంప‌తుల‌పై మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌లు కూడా ఎదుర్కోంటున్న సంగ‌తి తెలిసిందే. ముంబై కి చెందిన వేరియ‌బుల్ ప్రైవెట్ లిమిటెడ్ సంస్థ గెయిన్ బిట్ కాయిన్ పోంజీ స్కీమ్ ని నిర్వ‌హించింది. ఇందులో భాగంగా పెట్టుబ‌డులు పెడితే అధిక శాతం లాభాలొస్తాయ‌ని ఆశ‌చూపి మోసం చేసిన‌ట్లు కుంద్రా దంప‌తుల‌పై ఆరోప‌ణ‌లున్నాయి.

Tags:    

Similar News