జర్నలిస్టులపై విజయ సాయిరెడ్డి "గే" సెటైర్!

తనపై వచ్చిన సంచలన ఆరోపణల నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు

Update: 2024-07-15 10:44 GMT

తనపై వచ్చిన సంచలన ఆరోపణల నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఒక మహిళా అధికారితో ఆయనకు అక్రమ సంబంధం ఉందంటూ వచ్చిన వార్తలపై మీడియాలోని ఓ వర్గంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా స్పందించిన సాయిరెడ్డి... ఆగ్రహం, వెటకారం మేళవించిన సమాధానాలు ఇచ్చారు.

అవును... ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో విజయసాయిరెడ్డితో ఆమెకు సంబంధం ఉందని.. ఆమె (మాజీ) భర్త మదన్ మోహన్ ఆరోపించడం, దానిపై మీడియాలో విస్తృత ప్రచారం చేశారనే ఆరోపణలు రావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ పై "గే" సెటైర్లు వేసారు.

ఇందులో భాగంగా... కొన్ని మీడియా సంస్థలు కనీస అవగాహనలను ఎలా తారుమారు చేస్తున్నాయో వివరించే ప్రయత్నంలో భాగంగా విజయసాయి "గే" సారూప్యతను ఉపయోగించారు. ఈ క్రమంలో... తనను ప్రశ్నించిన జర్నలిస్ట్ తో... "నేను ఇంతకు ముందెన్నడూ కలవని పురుష జర్నలిస్టువి నువ్వు.. ఇప్పుడు కలిశాం.. మరో రెండు సార్లు కలుస్తాం.. అంతమాత్రాన్న మన ఇద్దరం స్వలింగ సంపర్కులమని అంటే ఎలా అని ప్రశ్నించారు.

కాగా.... ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో విజయసాయిరెడ్డితో ఆమెకు సంబంధం ఉందని.. ఆమె (మాజీ) భర్త మదన్ మోహన్ ఆరోపించడం, ఆ విషయం కొన్ని ఛానల్స్ లో వైరల్ గా మారి, డిబేట్లు నిర్వహించే వరకూ వెళ్లాయనే ఆరోపణలు రావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి స్పందించారు.

ఇందులో భాగంగా... తనపై ఓ వర్గానికి చెందిన మీడియాలో తనకు వ్యతిరేకంగా వస్తోన్న వరుస కథనాలపై నిప్పులు చెరిగారు. ఉద్దేశపూర్వకంగానే వాటిని వండివార్చుతున్నారంటూ మండిపడ్డారు. అసత్య వార్తలను రాసి, తన వ్యక్తిగత పరువుకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే తనను ప్రశ్నించిన జర్నలిస్టులపై ఇలా అసహనం ప్రదర్శించారు!

Tags:    

Similar News