టీడీపీ యువనేత మృతి.. టీడీపీలో తీవ్ర విషాదం

Update: 2021-03-08 03:15 GMT
యువనేత, టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు మృతి చెందినట్లు సమాచారం. గత బుధవారం అర్ధరాత్రి మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారని ప్రచారం జరిగింది.. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారని సమాచారం

ప్రస్తుతం రాంజీ విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది.. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు మొన్న వైద్యులు ప్రకటించారు.  ఆయన్ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించిన్నట్టు తెలిసింది.

అప్పటి నుంచి రాంజీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. తాజాగా పరిస్థితి విషమించి మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే అనారోగ్యానికి గల కారణం కుటుంబ సభ్యులు బయటపెట్టడం లేదు. ఆత్మహత్యాయత్నం చేశారనే ప్రచారం ఉంది.దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

రామ్‌జీ ఇంతకుముందు టాలీవుడ్ లో చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్నట్టు టాక్ ఉంది.. ప్రముఖ చిత్రనిర్మాత ఎంఎస్ రాజు సహకారంతో యువ హీరో సుమంత్ అశ్విన్ తొలి చిత్రం ‘తునీగా తునీగా’ నిర్మించారని సమాచారం.   మనోవేదనతో రాంజీ ఆత్మహత్యకు ప్రయత్నించారని ప్రచారం సాగుతోంది.
Tags:    

Similar News